భారత్లో ముస్లింలపై జరిగిన హింసాకాండకు ప్రతీకారం తీర్చుకుంటాo..
- May 21, 2016
భారత్లో ముస్లింలపై జరిగిన హింసాకాండకు ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాదసంస్థ 'ఇస్లామిక్స్టేట్' (ఐఎస్) హెచ్చరించింది. ఈ మేరకు 22 నిమిషాల నిడివి ఉన్న వీడియో విడుదల చేసింది. కశ్మీర్తోపాటు బాబ్రీమసీదు విధ్వంసం, గుజరాత్, ముజఫర్నగర్లలో మతకల్లోలాల సందర్భంగా ముస్లింలపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించారు. చెట్లను, ఆవులను, సూర్యుడిని పూజించే హిందువులతో కలిసి జీవించటమేమిటంటూ భారత్లోని ముస్లింలను ఎద్దేవా చేశారు. ఐఎస్ ఆధీనంలోని ప్రాంతాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఐఎస్ తరఫున సిరియాలో పనిచేస్తున్నారంటూ అయిదుగురు భారతీయ యువకులను వీడియోలో పరిచయం చేశారు. వివిధ ప్రశ్నలకు వారిసమాధానాలను చిత్రీకరించారు. ఈ యువకుల్లో ఒకడు థానెకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఫహాద్ తన్వీర్ షేక్ అని వెల్లడైంది. ఫహాద్ 2014లో ముగ్గురితో కలిసి సిరియాకు వెళ్లిపోయాడు. వీడియోలో ఫహాద్ తననుతాను అబూఅమ్రాఅల్హిందీ అని పరిచయం చేసుకున్నాడు. తనతోపాటు సిరియాకు వచ్చి మరణించిన షమీమ్కు నివాళి అర్పించాడు. ప్రతీకారం తీర్చుకోవటానికి కత్తులు చేతపట్టుకొని భారత్కు వస్తామంటూ హెచ్చరించాడు. ఫహాద్తోపాటు సిరియా వెళ్లిన అరీబ్మజిద్ ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆధీనంలో ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







