అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవద్దు: సౌదీ
- October 08, 2023
రియాద్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ శనివారం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్తో టెలిఫోన్ కాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా గాజా, దాని పరిసరాలలో నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. దాడుల తీవ్రతను తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని వారు అభిప్రాయబడ్డారు. ఏ రూపంలోనైనా అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని సౌదీ వ్యతిరేకమన్నారు. ఇరువురు అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తెరగాలని విదేశాంగ మంత్రి సూచించారు. పరిస్థితిని అదుపుచేసేందుకు, మరింత హింసను నివారించడానికి సంఘటితంగా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. ఇదే విషయమై సౌదీ విదేశాంగ మంత్రికి శనివారం యూరోపియన్ యూనియన్ ఫర్ ఫారిన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ పాలసీ ఉన్నత ప్రతినిధి జోసెప్ బోరెల్ ఫోన్ చేసి మాట్లాడారు.ఈ క్రమంలో సౌదీ విదేశాంగ మంత్రి.. ఈజిప్టు, ఖతార్ మరియు జోర్డాన్ల విదేశాంక మంత్రులతో మాట్లాడారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









