అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవద్దు: సౌదీ
- October 08, 2023
రియాద్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ శనివారం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్తో టెలిఫోన్ కాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా గాజా, దాని పరిసరాలలో నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. దాడుల తీవ్రతను తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని వారు అభిప్రాయబడ్డారు. ఏ రూపంలోనైనా అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని సౌదీ వ్యతిరేకమన్నారు. ఇరువురు అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తెరగాలని విదేశాంగ మంత్రి సూచించారు. పరిస్థితిని అదుపుచేసేందుకు, మరింత హింసను నివారించడానికి సంఘటితంగా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. ఇదే విషయమై సౌదీ విదేశాంగ మంత్రికి శనివారం యూరోపియన్ యూనియన్ ఫర్ ఫారిన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ పాలసీ ఉన్నత ప్రతినిధి జోసెప్ బోరెల్ ఫోన్ చేసి మాట్లాడారు.ఈ క్రమంలో సౌదీ విదేశాంగ మంత్రి.. ఈజిప్టు, ఖతార్ మరియు జోర్డాన్ల విదేశాంక మంత్రులతో మాట్లాడారు.
తాజా వార్తలు
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ









