ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలి: టి.గవర్నర్ ఆదేశాలు
- October 14, 2023
హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతిపై నలభై ఎనిమిది గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభుతి తెలిపారు. పోటి పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, లోనవుతున్న ఒత్తిళ్లను ప్రవళిక మరణం మరోసారి గుర్తు చేసిందని గవర్నర్ తెలిపారు. నిరుద్యోగ యువత నిరాశకు లోను కావద్దని, సాధనలో వారికి పూర్తి అండగా నిలుస్తానన్ని గవర్నర్ తెలిపారు.
కాగా, గ్రూప్-2కు ప్రిపేర్ అవుతున్న ప్రవల్లిక రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘నన్ను క్షమించండి అమ్మా! నేను చాలా నష్టజాతకురాలిని. నావల్ల మీరు బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా’ అని లేఖ రాసి తనువు చాలించింది.
తాజా వార్తలు
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం







