తెలంగాణ: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఖరారు
- October 14, 2023
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ఆ పార్టీ ముహూర్తం ఖరారు చేసింది. తొలి విడతలో ఆదివారం 58 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది.
ఈ మేరకు కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కె.మురళీధరన్ ప్రకటన చేశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరిశీలనకు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే.
కాంగ్రెస్ అధిష్టానం మిగతా రాష్ట్రాలతో పాటు తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తుందని మురళీధరన్ చెప్పారు. మరో రెండు రోజుల్లో మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. సీపీఎం, సీపీఐతో పొత్తులపై చర్చలు తుది దశలో ఉన్నాయని వివరించారు. పొత్తులపై ఆదివారం స్పష్టత వస్తుందని చెప్పారు.
గెలుపు అవకాశాలు ఉండి, పార్టీకి విధేయులుగా ఉన్న వారిని అభ్యర్థులుగా ఎంపిక చేశామని తెలిపారు. పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లడం తమ అంతర్గత విషయమని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. కాగా, ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఇప్పటికే కాంగ్రెస్ చెప్పింది. మైనారిటీలు, మహిళలు, బీసీలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









