ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- June 29, 2026
అబుదాబి: యూఏఈలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలు జూన్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి దశలో అబుదాబి–ఫుజైరా మధ్య రైళ్లు నడవనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల కోసం ఎతిహాద్ రైల్ సంస్థ టికెట్లు, ప్రయాణ నిబంధనలు, స్టేషన్ సౌకర్యాలు, రైలులో అందుబాటులో ఉండే సేవలకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
ప్రయాణానికి టికెట్, గుర్తింపు కార్డు తప్పనిసరి
ప్రతి ప్రయాణికుడు చెల్లుబాటు అయ్యే టికెట్తో పాటు పాస్పోర్ట్ లేదా ఎమిరేట్స్ ఐడీ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. టికెట్లో ఉన్న పేరుతో ఐడీ వివరాలు సరిపోలాలి. ప్రయాణంలో ఎప్పుడైనా అధికారులు వీటిని తనిఖీ చేయవచ్చు. మొబైల్లోని డిజిటల్ టికెట్ సరిపోతుంది. ముద్రించిన టికెట్ కూడా చెల్లుతుంది.
ముందస్తు బుకింగ్కు ప్రాధాన్యం
ప్రయాణానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలని ఎతిహాద్ రైల్ సూచించింది. ఖాళీలు ఉంటే రైలు బయలుదేరే ఐదు నిమిషాల ముందు వరకు టికెట్లు లభించే అవకాశం ఉంది. స్టేషన్లలోని వెండింగ్ మెషీన్ల ద్వారా కూడా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. యాప్ లేదా వెబ్సైట్ ద్వారా సీటును ఎంపిక చేసుకునే సౌకర్యం కూడా ఉంది.
10 నిమిషాల ముందే స్టేషన్కు చేరుకోవాలి
ప్రయాణికులు రైలు బయలుదేరే కనీసం 10 నిమిషాల ముందు స్టేషన్కు చేరుకోవాలని సూచించారు. రైలు బయలుదేరే రెండు నిమిషాల ముందు గేట్లు మూసివేస్తారు. ఒకసారి స్టేషన్లోకి ప్రవేశించిన తర్వాత బయటకు వెళ్లిన ప్రయాణికులకు మళ్లీ ప్రవేశం (రీ-ఎంట్రీ) అనుమతించబడదు.
స్కూటర్లకు అనుమతి లేదు
ఈ-స్కూటర్లతో సహా అన్ని రకాల స్కూటర్లను రైలులోకి అనుమతించరు. అయితే నిర్ణీత పరిమాణంలో ఉన్న క్యారియర్లో ఒక్క పెంపుడు జంతువును తీసుకెళ్లవచ్చు. మడతపెట్టే బేబీ స్ట్రోలర్లను కూడా అనుమతిస్తారు.
పిల్లలు, పర్యాటకులకు అవకాశం
14 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఒంటరిగా ప్రయాణించవచ్చు. అంతకంటే చిన్నవారు పెద్దలతో కలిసి రావాలి. పర్యాటకులు కూడా చెల్లుబాటు అయ్యే టికెట్, గుర్తింపు పత్రంతో ప్రయాణించవచ్చు. వికలాంగుల కోసం స్టేషన్లు, రైళ్లలో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
రైలులో ఉచిత వై-ఫై
ప్రయాణికులకు ఉచిత వై-ఫై అందుబాటులో ఉంటుంది. అల్పాహారం, మద్యపాన రహిత పానీయాలను కొనుగోలు చేసే సౌకర్యం ఉంటుంది. ప్రయాణికులు తమ ఆహారాన్ని తీసుకురావచ్చు. అయితే మద్యం తీసుకురావడం, రైలులో ధూమపానం లేదా ఈ-సిగరెట్ వినియోగం పూర్తిగా నిషేధం.
ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలు యూఏఈ జాతీయ రైల్వే నెట్వర్క్లో తొలి దశగా ప్రారంభమవుతున్నాయి. 2026 సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి ప్రయాణికుల రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!







