ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- June 29, 2026
పారిస్: ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఫ్రాన్స్ అధికారిక పర్యటనలో భాగంగా సోమవారం పారిస్లోని ఎలిసీ ప్యాలెస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాక్రాన్, సుల్తాన్ హైథమ్తో పాటు ఆయన ప్రతినిధి బృందానికి ఫ్రెంచ్ గణతంత్రం తరఫున ఘన స్వాగతం పలికారు.
సుల్తాన్ హైథమ్ ఎలిసీ ప్యాలెస్కు చేరుకోగానే గౌరవ వందనం నిర్వహించగా, సైనిక సంగీత బృందం ప్రత్యేక వాయిద్య ప్రదర్శన ఇచ్చింది. అనంతరం సుల్తాన్ గౌరవ వందన దళాన్ని పరిశీలించారు.
తర్వాత సుల్తాన్ హైథమ్ ఫ్రాన్స్కు చెందిన ఉన్నతాధికారులతో, అధ్యక్షుడు మాక్రాన్ ఒమాన్ అధికార ప్రతినిధి బృంద సభ్యులతో పరస్పరం పరిచయం చేసుకున్నారు. ఇరు దేశాధినేతలు జ్ఞాపికలను పరస్పరం మార్చుకుని, ఈ సందర్భంగా స్మారక ఫొటో దిగారు.
అనంతరం జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో రాజకీయ, ఆర్థిక అంశాలతో పాటు ఇరు దేశాలకు సంబంధించిన పరస్పర ప్రయోజనాల విషయాలపై విస్తృతంగా చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, వాటి ప్రభావం, ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితులపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు.
ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పెట్టుబడులను పెంచడం, వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, కొత్త రంగాల్లో భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడం ద్వారా సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించాలని ఇరువురు నాయకులు ఆకాంక్షించారు. అలాగే పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నట్లు వారు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ విమానాల రాకపోకలు బంద్
- వాట్సాప్లో ఏఐ స్కామ్ అలర్ట్ ఫీచర్..
- ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్
- వన్డే ప్రపంచకప్ పై ఐసీసీ సంచలన నిర్ణయం!
- 30 ఏళ్లలోనే మెనోపాజ్కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!







