ఉద్యోగాలు అమ్ముకుంటున్న కుంభకోణం..టీసీఎస్లో 19 మంది పై వేటు
- October 16, 2023
ముంబై: బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలను అమ్ముకుంటున్న కుంభకోణం ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ లో వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలకు పాల్పడిన 19 మందిపై టీసీఎస్ వేటు వేసింది. ఈ విషయాన్ని టీసీఎస్ యాజమాన్యం నిన్న అధికారికంగా ప్రకటించింది. తాము జరిపిన విచారణలో రిక్రూట్ మెంట్ స్కామ్ లో 19 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఈ 19 మందిలో 16 మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించగా, మరో ముగ్గురిని రిసోర్స్ మేనేజ్ మెంట్ నుంచి తొలగించారు. ఈ స్కామ్ ఈ ఏడాది జూన్ లో వెలుగులోకి వచ్చింది. వెంటనే కంపెనీ దర్యాప్తు చేపట్టింది. నాలుగు నెలలు దర్యాప్తు చేసిన అనంతరం స్కామ్ కు పాల్పడిన వారిపై కంపెనీ చర్యలు తీసుకుంది. రానున్న కాలంలో కార్పొరేట్ గవర్నెన్స్ ను మరింత బలోపేతం చేస్తామని టీసీఎస్ తెలిపింది.
తాజా వార్తలు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..







