ఉద్యోగాలు అమ్ముకుంటున్న కుంభకోణం..టీసీఎస్‌లో 19 మంది పై వేటు

- October 16, 2023 , by Maagulf
ఉద్యోగాలు అమ్ముకుంటున్న కుంభకోణం..టీసీఎస్‌లో 19 మంది పై వేటు

ముంబై: బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలను అమ్ముకుంటున్న కుంభకోణం ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ లో వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలకు పాల్పడిన 19 మందిపై టీసీఎస్ వేటు వేసింది. ఈ విషయాన్ని టీసీఎస్ యాజమాన్యం నిన్న అధికారికంగా ప్రకటించింది. తాము జరిపిన విచారణలో రిక్రూట్ మెంట్ స్కామ్ లో 19 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఈ 19 మందిలో 16 మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించగా, మరో ముగ్గురిని రిసోర్స్ మేనేజ్ మెంట్ నుంచి తొలగించారు. ఈ స్కామ్ ఈ ఏడాది జూన్ లో వెలుగులోకి వచ్చింది. వెంటనే కంపెనీ దర్యాప్తు చేపట్టింది. నాలుగు నెలలు దర్యాప్తు చేసిన అనంతరం స్కామ్ కు పాల్పడిన వారిపై కంపెనీ చర్యలు తీసుకుంది. రానున్న కాలంలో కార్పొరేట్ గవర్నెన్స్ ను మరింత బలోపేతం చేస్తామని టీసీఎస్ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com