దేశాలకు బాస్మతీయేతర బియ్యం ఎగుమతులకు భారత్ అనుమతి
- October 18, 2023
న్యూఢిల్లీ: బాస్మతీయేతర బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేపాల్, కామెరూన్, కోట్ డి ఐవోయిర్, రిపబ్లిక్ ఆఫ్ గినియా, మలేషియా, పిలిప్పీన్స్, సీషెల్స్లకు బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని వివిధ పరిమాణాలలో ఎగుమతి చేయడానికి అనుమతించింది. ముఖ్యంగా, దేశీయంగా ధరలను అదుపు చేసేందుకు, దేశీయ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని జులై 20 నుండి బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతి నిషేధించబడింది.
ఏడు దేశాలకు 10,34,800 టన్నుల బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేసుకోవచ్చునని, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కింద వీటిని అనుమతిస్తున్నట్లు డీజీఎఫ్టీ తెలిపింది. పలు దేశాల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక అనుమతులను జారీ చేసింది. ఇంతకుముందు యూఏఈ, సింగపూర్లకు బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించింది.
గతవారం కేంద్ర ప్రభుత్వం పారాబాయిల్డ్ రైస్పై 20 శాతం ఎగుమతి సుంకాన్ని మార్చి 31, 2024 వరకు పొడిగించింది. పొట్టుతో పాక్షికంగా ఉడకబెట్టిన బియ్యాన్ని పారాబాయిల్డ్ రైస్ అంటారు. 2022 సెప్టెంబరులో భారత్ బ్రోకెన్ రైస్ ఎగుమతులను నిషేధించింది. వరి పంట కింద విస్తీర్ణం తగ్గడం వల్ల తక్కువ ఉత్పత్తి గురించి ఆందోళనల మధ్య పారాబాయిల్డ్ రైస్ మినహా బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. ఆ తర్వాత నవంబర్లో నిషేధాన్ని ఎత్తివేసింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







