గాజా ఆసుపత్రి దాడి పై ప్రధాని మోదీ విచారం..
- October 18, 2023
న్యూ ఢిల్లీ: గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రి పై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దోషులు ఎవరైనప్పటికీ వారిని విడిచిపెట్టవద్దని అన్నారు. మంగళవారం (17 అక్టోబర్ 2023) గాజాలోని అల్-అహ్లీ ఆసుపత్రి మీద జరిగిన వైమానిక దాడిలో సుమారు 500 మంది పౌరులు మరణించారు. దీనిపై ప్రధాని తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా స్పందిస్తూ “ఈ యుద్ధంలో పౌరులు మరణించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఈ దాడికి బాధ్యులను విడిచిపెట్టకూడదు” అని పోస్ట్ చేశారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. ఉపరితల బలగాలు కూడా ఉత్తర గాజాపై దాడి చేస్తున్నాయి. వాస్తవానికి మూడు రోజుల ముందే ఉత్తర గాజాలోని ప్రజలను ఖాళీ చేయమంటూ ఇజ్రాయెల్ ఆదేశించింది. అక్కడున్న ఆసుపత్రిని కూడా ఖాళీ చేయమని హెచ్చరించారు. అనంతరం ఈ దాడి జరిగింది. మంగళవారం అర్థరాత్రి ఈ ఆసుపత్రిపై వైమానిక దాడి జరిగింది. పాలస్తీనాలోని హమాస్ నియంత్రణలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇక్కడ నివసిస్తున్న 500 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసి, పౌరులను చంపేశారంటూ విమర్శలు వస్తున్నాయి.
గాజాలోని ఆసుపత్రిపై దాడిలో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఐక్యరాజ్యసమితి, దాని అగ్రనేతలు, ఏజెన్సీలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. అలాగే ఈ సంఘటనను తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ.. గాజాలోని ఆసుపత్రిపై ఈ రోజు జరిగిన దాడిలో వందలాది మంది పాలస్తీనియన్లు మరణించినందుకు తను చాలా బాధపడ్డానని, తాను దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాజాలోని ఆసుపత్రులు, వైద్య సిబ్బంది అంతర్జాతీయ మానవతా చట్టం కింద రక్షణ పొందుతారని గటెర్రస్ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









