తెలంగాణలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం: రాహుల్ ట్వీట్
- October 20, 2023
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుంది..రాష్ట్రంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అన్నాడు రాహుల్. వచ్చే నెలలో తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేపట్టింది. ములుగు లో ప్రారంభమైన ఈ యాత్ర మూడు రోజులుగా పలు జిల్లాలో సాగింది. ఈ మొదటి విడత యాత్ర లో రాహుల్ పాల్గొని నేతల్లో , కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
మొదటి విడత బస్సు యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా పవర్ ఫుల్ ట్వీట్ చేశారు. ‘‘ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుంది. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ రాష్ట్రానికి నాది గ్యారెంటీ’’ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఈ నెల 18న రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ బస్సు యాత్రను ప్రారంభించారు. రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం యాత్రను చేపట్టారు. ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







