ఒమన్లో తేజ్ తుఫానుపై పౌరులకు హెచ్చరికలు జారీ
- October 22, 2023
యూఏఈ: మస్కట్లోని యూఏఈ రాయబార కార్యాలయం అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న తుఫాను తేజ్ కారణంగా ఏర్పడే అస్థిర వాతావరణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని ఒమన్లోని తన పౌరులకు పిలుపునిచ్చింది. శనివారం సాయంత్రం చేసిన ట్వీట్లో.. సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ఎమిరాటీస్ను కోరారు. అత్యవసర సమయాల్లో యూఏఈ ఎంబసీ హాట్లైన్ నంబర్లను 0097180024 లేదా 0097180044444 సంప్రదించాలని కోరింది.మరోవైపు ఆదివారం నాటికి ఒమన్ను తాకనున్న ‘తేజ్’ తుఫానుగా మారుతుందని భావిస్తున్నారు. తేజ్ తుఫాను కారణంగా సలాలా ఓడరేవు ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి (స్థానిక కాలమానం ప్రకారం) తాత్కాలికంగా మూసివేయబడుతుందని ఒమన్ శనివారం ప్రకటించింది. అరేబియా సముద్రానికి దక్షిణాన ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) శుక్రవారం హెచ్చరించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







