ఒమన్లో తేజ్ తుఫానుపై పౌరులకు హెచ్చరికలు జారీ
- October 22, 2023
యూఏఈ: మస్కట్లోని యూఏఈ రాయబార కార్యాలయం అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న తుఫాను తేజ్ కారణంగా ఏర్పడే అస్థిర వాతావరణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని ఒమన్లోని తన పౌరులకు పిలుపునిచ్చింది. శనివారం సాయంత్రం చేసిన ట్వీట్లో.. సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ఎమిరాటీస్ను కోరారు. అత్యవసర సమయాల్లో యూఏఈ ఎంబసీ హాట్లైన్ నంబర్లను 0097180024 లేదా 0097180044444 సంప్రదించాలని కోరింది.మరోవైపు ఆదివారం నాటికి ఒమన్ను తాకనున్న ‘తేజ్’ తుఫానుగా మారుతుందని భావిస్తున్నారు. తేజ్ తుఫాను కారణంగా సలాలా ఓడరేవు ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి (స్థానిక కాలమానం ప్రకారం) తాత్కాలికంగా మూసివేయబడుతుందని ఒమన్ శనివారం ప్రకటించింది. అరేబియా సముద్రానికి దక్షిణాన ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) శుక్రవారం హెచ్చరించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









