2024-25లో యూనిఫైడ్ జిసిసి వీసా
- October 24, 2023
యూఏఈ : గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు ఏకీకృత టూరిస్ట్ వీసా ఆమోదం పొందిందని, వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిని ప్రారంభించనున్నట్లు యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి తెలిపారు. మస్కట్లో జరిగిన GCC మంత్రుల సమావేశంలో స్కెంజెన్-శైలి వీసాను ఆమోదించినట్లు పేర్కొన్నారు. దీనితో ఒకే వీసాతో పర్యాటకులు ఆరు గల్ఫ్ దేశాలను సందర్శించవచ్చు. ఈ వీసాను 2024 -25లో అమలులోకి తేవాలని భావిస్తున్నారు.
యూఏఈ యొక్క ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం రంగం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. GDPలో 14 శాతం వాటా కలిగి ఉంది. దీనిని 18 శాతానికి పెంచాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు.2023 మొదటి అర్ధభాగంలో 8.55 మిలియన్ల అంతర్జాతీయ సందర్శకులు యూఏఈని సందర్శించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ స్కెంజెన్-శైలి టూరిస్ట్ వీసాతో జీసీసీ దేశాల ఆర్థిక వ్యవస్థలకు గేమ్ ఛేంజర్గా మారుతుందని, ఈ ప్రాంతంలోని పౌరులు మరియు నివాసితులకు అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని హోటల్ యజమానులు, ట్రావెల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







