2024-25లో యూనిఫైడ్ జిసిసి వీసా
- October 24, 2023
యూఏఈ : గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు ఏకీకృత టూరిస్ట్ వీసా ఆమోదం పొందిందని, వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిని ప్రారంభించనున్నట్లు యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి తెలిపారు. మస్కట్లో జరిగిన GCC మంత్రుల సమావేశంలో స్కెంజెన్-శైలి వీసాను ఆమోదించినట్లు పేర్కొన్నారు. దీనితో ఒకే వీసాతో పర్యాటకులు ఆరు గల్ఫ్ దేశాలను సందర్శించవచ్చు. ఈ వీసాను 2024 -25లో అమలులోకి తేవాలని భావిస్తున్నారు.
యూఏఈ యొక్క ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం రంగం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. GDPలో 14 శాతం వాటా కలిగి ఉంది. దీనిని 18 శాతానికి పెంచాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు.2023 మొదటి అర్ధభాగంలో 8.55 మిలియన్ల అంతర్జాతీయ సందర్శకులు యూఏఈని సందర్శించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ స్కెంజెన్-శైలి టూరిస్ట్ వీసాతో జీసీసీ దేశాల ఆర్థిక వ్యవస్థలకు గేమ్ ఛేంజర్గా మారుతుందని, ఈ ప్రాంతంలోని పౌరులు మరియు నివాసితులకు అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని హోటల్ యజమానులు, ట్రావెల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







