8 నెలలలో ఈ-స్కూటర్ ప్రమాదాల్లో 5 మంది మృతి, 29 మందికి గాయాలు
- October 25, 2023
దుబాయ్: గత ఎనిమిది నెలలుగా దుబాయ్లో జరిగిన ఈ-స్కూటర్ ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. ఇ-స్కూటర్లపై 32 ప్రమాదాలు నమోదుఖ్యినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
ఎనిమిది నెలల్లో రైడర్లపై 10,000 జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. రైడర్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వీడియోను పోలీసులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే రైడర్లపై 300 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని, 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇ-స్కూటర్ను నడపడం వంటి ఉల్లంఘనలను వీడియోలో చూపించారు. ఈ-స్కూటర్ రైడర్లు అన్ని సంబంధిత భద్రతా నియమాలను పాటించాలని అధికారి కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







