బ్రిటన్ లో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు
- May 23, 2016
బ్రిటన్ లో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు వచ్చింది. స్కూళ్లు తెరవగానే అందులోని పిల్లలను కాల్చిపారేస్తామని.. వారి తలలు తీసుకెళతామని గుర్తు తెలియని వ్యక్తులు వరుస ఫోన్ కాల్స్ చేశారు. ముఖ్యంగా వారు 19 స్కూళ్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అది కూడా అతిముఖ్యమైన జీసీఎస్ఈ పరీక్షలు జరగుతుండగా. దీంతో ఆ పరీక్షలు అప్పటికప్పుడు వాయిదా వేసి అందులోని విద్యార్థులందరిని హుటాహుటిన వారి వారి ఇళ్లకు తరలించారు.ఓ పత్రికకు స్కూలు యాజమాన్యాలు ఏం చెప్పారంటే..'కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మాకు వరుస ఫోన్ కాల్స్ చేసి ఏం చెప్పారంటే.. విద్యార్థులపై కాల్పులు జరుపుతాం. వారి తలలు తీసుకొని వెళతాం' అని వరుస ఫోన్ కాల్స్ వచ్చినట్లు చెప్పారు. అయితే, 19 స్కూళ్లకు మాత్రమే ఈ బెదిరింపులు వచ్చినప్పటికీ.. పోలీసు అధికారులు మాత్రం దేశంలోని దాదాపు అన్ని పాఠశాలలు ముందు జాగ్రత్తగా మూసివేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







