గాజాపై మరోసారి విరుకుపడ్డ ఇజ్రాయెల్

- October 28, 2023 , by Maagulf
గాజాపై మరోసారి విరుకుపడ్డ ఇజ్రాయెల్

యూఏఈ: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుకుపడ్డది. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని హమాస్ సొరంగాలు,  భూగర్భ బంకర్‌లపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబు దాడి చేశాయి. ఇందులో పదుల సంఖ్యలో పాలస్తీయన్లు మరణించగా.. వందలాది మంది గాయపడ్డట్లు హమాస్ ప్రకటించింది. ఈ దాడుల్లో 50కి పైగా బందీలు కూడా మరణించారని సమాచారం. ఇదిలా ఉండగా ఫైటర్ జెట్‌లు 150 "భూగర్భ లక్ష్యాలను" చేధించాయని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. వైమానికి దాడులను ఉధృతం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం తెలిపింది.  ముట్టడిలో ఉన్న గాజాలో ఉన్న 2.3 మిలియన్ల మందిని బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఇజ్రాయెల్ కమ్యూనికేషన్‌ వ్యవస్థలను నాశనం చేసింది.మరోవైపు హమాస్ విస్తృతమైన సొరంగాలు, భూగర్భ బంకర్ల నెట్‌వర్క్ లక్ష్యంగా భూతల దాడులకు సిద్ధం అవుతున్నట్లు అని ఇజ్రాయెల్ సైనిక అధికారులు చెప్పారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com