గాజాపై మరోసారి విరుకుపడ్డ ఇజ్రాయెల్
- October 28, 2023
యూఏఈ: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుకుపడ్డది. ఉత్తర గాజా స్ట్రిప్లోని హమాస్ సొరంగాలు, భూగర్భ బంకర్లపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబు దాడి చేశాయి. ఇందులో పదుల సంఖ్యలో పాలస్తీయన్లు మరణించగా.. వందలాది మంది గాయపడ్డట్లు హమాస్ ప్రకటించింది. ఈ దాడుల్లో 50కి పైగా బందీలు కూడా మరణించారని సమాచారం. ఇదిలా ఉండగా ఫైటర్ జెట్లు 150 "భూగర్భ లక్ష్యాలను" చేధించాయని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. వైమానికి దాడులను ఉధృతం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం తెలిపింది. ముట్టడిలో ఉన్న గాజాలో ఉన్న 2.3 మిలియన్ల మందిని బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఇజ్రాయెల్ కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేసింది.మరోవైపు హమాస్ విస్తృతమైన సొరంగాలు, భూగర్భ బంకర్ల నెట్వర్క్ లక్ష్యంగా భూతల దాడులకు సిద్ధం అవుతున్నట్లు అని ఇజ్రాయెల్ సైనిక అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







