కేరళ ప్రార్థనా సమావేశంలో పేలుళ్లు
- October 29, 2023
కేరళ: దక్షిణ భారతదేశంలోని కేరళలో ప్రార్థనా సమావేశంలో పేలుళ్లు జరిగాయి. ఇందులో ఒక మహిళ మరణించగా.. 36మంది తీవ్రంగా గాయపడ్డారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఈ ఘటనను దిగ్భ్రాంతికరమని , దురదృష్టకరమని పేర్కొన్నారు. యెహోవాసాక్షుల హాలులో పేలుడు జరిగింది. కేరళలోని కొచ్చి సమీపంలోని కలమస్సేరిలో జరిగిన పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో గాయపడ్డ పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం ప్రార్థనా సమావేశంలో కలమస్సేరిలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో కనీసం మూడు పేలుళ్లు జరిగినట్లు స్థానిక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పి.వి. బేబీ తెలిపారు. మూడు రోజుల ప్రార్థన సమావేశాలలో సుమారు 2,500 మంది వ్యక్తులు పాల్గొన్నారని వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు తానే బాధ్యుడిని అంటూ డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయారు. యెహోవాసాక్షులు 19వ శతాబ్దంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉద్భవించిన క్రైస్తవ మత సమూహం.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







