కేరళ ప్రార్థనా సమావేశంలో పేలుళ్లు
- October 29, 2023
కేరళ: దక్షిణ భారతదేశంలోని కేరళలో ప్రార్థనా సమావేశంలో పేలుళ్లు జరిగాయి. ఇందులో ఒక మహిళ మరణించగా.. 36మంది తీవ్రంగా గాయపడ్డారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఈ ఘటనను దిగ్భ్రాంతికరమని , దురదృష్టకరమని పేర్కొన్నారు. యెహోవాసాక్షుల హాలులో పేలుడు జరిగింది. కేరళలోని కొచ్చి సమీపంలోని కలమస్సేరిలో జరిగిన పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో గాయపడ్డ పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం ప్రార్థనా సమావేశంలో కలమస్సేరిలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో కనీసం మూడు పేలుళ్లు జరిగినట్లు స్థానిక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పి.వి. బేబీ తెలిపారు. మూడు రోజుల ప్రార్థన సమావేశాలలో సుమారు 2,500 మంది వ్యక్తులు పాల్గొన్నారని వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు తానే బాధ్యుడిని అంటూ డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయారు. యెహోవాసాక్షులు 19వ శతాబ్దంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉద్భవించిన క్రైస్తవ మత సమూహం.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







