గాజా కాల్పుల విరమణను తిరస్కరించిన ఇజ్రాయెల్
- October 31, 2023
యూఏఈ: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం హమాస్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ యుద్ధంలో కాల్పుల విరమణను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. మరోవైపు గాజాలో అడుగుపెట్టిన ఇజ్రాయెల్ బలగాలు ఓ బందీని విడిపించినట్లు ప్రకటించాయి. "కాల్పు విరమణ కోసం పిలుపు అంటే ఇజ్రాయెల్ హమాస్కు లొంగిపోవాలని, ఉగ్రవాదానికి లొంగిపోవాలని పిలుపునిస్తున్నాయి" అని నెతన్యాహు అన్నారు. ఈ యుద్ధం గెలిచే వరకు పోరాటం ఆగదని ఆయన పేర్కొన్నారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్ దాడులు చేసింది. ఇందులో 1,400 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. అనంతరం 230 మందికి పైగా ప్రజలను బందీలుగా చేసుకొని వారిని గాజాకు తరలించింది హమాస్. ఆ తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్పై యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ అప్పటి నుండి హమాస్ పాలనలో ఉన్న గాజాపై భారీ వైమానిక బాంబు దాడులను చేపడుతుంది. తాజాగా ఇజ్రాయెల్ బలగాలు గాజాలోకి ప్రవేశించాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి మానవతావాద సంధి కోసం పదేపదే పిలుపునిస్తుంది. గాజాలో హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ 8,000 మందికి పైగా మరణించినట్లు పేర్కొంది. వారిలో చాలా మంది పిల్లలు ఉన్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







