గాజా కాల్పుల విరమణను తిరస్కరించిన ఇజ్రాయెల్

- October 31, 2023 , by Maagulf
గాజా కాల్పుల విరమణను తిరస్కరించిన ఇజ్రాయెల్

యూఏఈ: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ యుద్ధంలో కాల్పుల విరమణను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. మరోవైపు గాజాలో అడుగుపెట్టిన ఇజ్రాయెల్ బలగాలు ఓ బందీని విడిపించినట్లు ప్రకటించాయి. "కాల్పు విరమణ కోసం పిలుపు అంటే ఇజ్రాయెల్ హమాస్‌కు లొంగిపోవాలని, ఉగ్రవాదానికి లొంగిపోవాలని పిలుపునిస్తున్నాయి" అని నెతన్యాహు అన్నారు.  ఈ యుద్ధం గెలిచే వరకు పోరాటం ఆగదని ఆయన పేర్కొన్నారు.  అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్ దాడులు చేసింది. ఇందులో   1,400 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. అనంతరం 230 మందికి పైగా ప్రజలను బందీలుగా చేసుకొని వారిని గాజాకు తరలించింది హమాస్. ఆ తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ అప్పటి నుండి హమాస్ పాలనలో ఉన్న గాజాపై భారీ వైమానిక బాంబు దాడులను చేపడుతుంది. తాజాగా ఇజ్రాయెల్ బలగాలు గాజాలోకి ప్రవేశించాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి మానవతావాద సంధి కోసం పదేపదే పిలుపునిస్తుంది. గాజాలో హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ 8,000 మందికి పైగా మరణించినట్లు పేర్కొంది. వారిలో చాలా మంది పిల్లలు ఉన్నట్లు పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com