గాజా కాల్పుల విరమణను తిరస్కరించిన ఇజ్రాయెల్
- October 31, 2023
యూఏఈ: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం హమాస్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ యుద్ధంలో కాల్పుల విరమణను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. మరోవైపు గాజాలో అడుగుపెట్టిన ఇజ్రాయెల్ బలగాలు ఓ బందీని విడిపించినట్లు ప్రకటించాయి. "కాల్పు విరమణ కోసం పిలుపు అంటే ఇజ్రాయెల్ హమాస్కు లొంగిపోవాలని, ఉగ్రవాదానికి లొంగిపోవాలని పిలుపునిస్తున్నాయి" అని నెతన్యాహు అన్నారు. ఈ యుద్ధం గెలిచే వరకు పోరాటం ఆగదని ఆయన పేర్కొన్నారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్ దాడులు చేసింది. ఇందులో 1,400 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. అనంతరం 230 మందికి పైగా ప్రజలను బందీలుగా చేసుకొని వారిని గాజాకు తరలించింది హమాస్. ఆ తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్పై యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ అప్పటి నుండి హమాస్ పాలనలో ఉన్న గాజాపై భారీ వైమానిక బాంబు దాడులను చేపడుతుంది. తాజాగా ఇజ్రాయెల్ బలగాలు గాజాలోకి ప్రవేశించాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి మానవతావాద సంధి కోసం పదేపదే పిలుపునిస్తుంది. గాజాలో హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ 8,000 మందికి పైగా మరణించినట్లు పేర్కొంది. వారిలో చాలా మంది పిల్లలు ఉన్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!







