వెనుదిరిగిన జపాన్ బృందం..
- May 24, 2016
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జపాన్ బృందం షాక్ ఇచ్చింది. తాత్కాలిక సచివాలయం వెలగపూడిలో అయిదు నిమిషాలు కూడా సందర్శించకుండా ఆ బృందం వెళ్లిపోయింది. బస్సులో నుంచే నిర్మాణాలను చూసిన ఆ బృందం వెనుదిరిగింది. కాగా జపాన్ బృందం తాత్కాలిక సచివాలయాన్ని సందర్శిస్తుందంటూ ఎల్లో మీడియా మంగళవారం ఉదయం నుంచే హడావుడి చేసింది. అయితే బృంద సభ్యులు మాత్రం వెలగపూడిలో కనీసం బస్సు దిగి కూడా చూడలేదు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చేవరకూ కూడా జపాన్ బృందం అక్కడ వేచి చూడకుండానే వెళ్లిపోయింది. అనంతరం అక్కడకు వచ్చిన చంద్రబాబు... అధికారులతో భేటీ అయ్యారు. సచివాలయ నిర్మాణ మ్యాప్ ను పరిశీలించిన ఆయన, ఎప్పటికప్పుడూ నిర్మాణ పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు వెనుదిరిగిన
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







