వెనుదిరిగిన జపాన్ బృందం..

- May 24, 2016 , by Maagulf
వెనుదిరిగిన జపాన్ బృందం..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జపాన్ బృందం షాక్ ఇచ్చింది. తాత్కాలిక సచివాలయం వెలగపూడిలో అయిదు నిమిషాలు కూడా సందర్శించకుండా ఆ బృందం వెళ్లిపోయింది. బస్సులో నుంచే నిర్మాణాలను చూసిన ఆ బృందం వెనుదిరిగింది. కాగా జపాన్ బృందం తాత్కాలిక సచివాలయాన్ని సందర్శిస్తుందంటూ ఎల్లో మీడియా మంగళవారం ఉదయం నుంచే హడావుడి చేసింది. అయితే బృంద సభ్యులు మాత్రం వెలగపూడిలో కనీసం బస్సు దిగి కూడా చూడలేదు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చేవరకూ కూడా జపాన్ బృందం అక్కడ వేచి చూడకుండానే వెళ్లిపోయింది. అనంతరం అక్కడకు వచ్చిన చంద్రబాబు... అధికారులతో భేటీ అయ్యారు. సచివాలయ నిర్మాణ మ్యాప్ ను పరిశీలించిన ఆయన, ఎప్పటికప్పుడూ నిర్మాణ పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు  వెనుదిరిగిన 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com