ఇన్స్యూరెన్స్ కార్యాలయాల్లో ట్రాఫిక్ సెల్
- May 24, 2016
ఖతార్లో ఇకనుంచి ఇన్స్యూరెన్స్ కార్యాలయాల్లోనే ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ సెల్ ద్వారా వాహనదారులకు సేవలు అందించాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ అధికారిక పేజ్ ద్వారా ఈ వివరాల్ని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు వాహనదారులు ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కోసం వెళుతుంటారు. అయితే అక్కడ వారికి ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ నుంచి క్లియరెన్స్ అవసరమవుతుంది. దాని కోసం వాహనదారులు ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులు లేకుండా ఇన్స్యూరెన్స్ కార్యాలయాలకి సమీపంలోనే ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయాల్ని ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని భావించి మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐదు కార్యాలయాల్ని ప్రారంభించినట్లు పేర్కొంది. ఇన్స్యూరెన్స్ కంపెనీల వద్ద నియమించిన ట్రాఫిక్ ఇన్వెస్టిగేటర్స్ ప్రమాద వివరాల్ని ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో టాబ్లెట్ ద్వారా రిజిస్టర్ చేసి, పరిస్థితిని ఇన్స్యూరెన్స్ కంపెనీలకు వివరిస్తారు. ఆ తర్వాత ఇన్స్యూరెన్స్ కంపెనీ తన పని తాను చేసుకుపోతుంది. ట్రాఫిక్ డైరెక్టరేట్ మరియు ఇన్స్యూరెన్స్ కంపెనీల మధ్య లింకప్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







