ఇన్స్యూరెన్స్ కార్యాలయాల్లో ట్రాఫిక్ సెల్
- May 24, 2016
ఖతార్లో ఇకనుంచి ఇన్స్యూరెన్స్ కార్యాలయాల్లోనే ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ సెల్ ద్వారా వాహనదారులకు సేవలు అందించాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ అధికారిక పేజ్ ద్వారా ఈ వివరాల్ని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు వాహనదారులు ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కోసం వెళుతుంటారు. అయితే అక్కడ వారికి ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ నుంచి క్లియరెన్స్ అవసరమవుతుంది. దాని కోసం వాహనదారులు ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులు లేకుండా ఇన్స్యూరెన్స్ కార్యాలయాలకి సమీపంలోనే ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయాల్ని ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని భావించి మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐదు కార్యాలయాల్ని ప్రారంభించినట్లు పేర్కొంది. ఇన్స్యూరెన్స్ కంపెనీల వద్ద నియమించిన ట్రాఫిక్ ఇన్వెస్టిగేటర్స్ ప్రమాద వివరాల్ని ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో టాబ్లెట్ ద్వారా రిజిస్టర్ చేసి, పరిస్థితిని ఇన్స్యూరెన్స్ కంపెనీలకు వివరిస్తారు. ఆ తర్వాత ఇన్స్యూరెన్స్ కంపెనీ తన పని తాను చేసుకుపోతుంది. ట్రాఫిక్ డైరెక్టరేట్ మరియు ఇన్స్యూరెన్స్ కంపెనీల మధ్య లింకప్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.
తాజా వార్తలు
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!









