శ్రీలంక పై భారత్ ఘన విజయం..
- November 02, 2023
ముంబై: భారత్ లో ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించగా... శ్రీలంక చరిత్రలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత్ విసిరిన భారీ లక్ష్యాన్ని చేధించలేక అత్యంత తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయింది. 358 పరుగుల ఛేదనలో బ్యాటింగ్కు వచ్చిన శ్రీలంక.. ఏ మాత్రం పోటి ఇవ్వలేక చతికిల పడింది. భారత్ 302 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక కేవలం 19. 4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నేరుగా సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది టీమిండియా. వరుసగా ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బౌలర్లు నిలవలేకపోయారు, నిప్పులు చెరిగిన షమీ ధాటికి కుప్పకూలారు. అయిదు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు షమీ. మహమ్మద్ సిరాజ్ ఆరంభంలొనే మూడు వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు. తొలి బంతికే వికెట్ కోల్పోయి పరుగుల కంటే ముందు వికెట్ల ఖాతా తెరిచిన లంకను మహమ్మద్ సిరాజ్, షమీలు నిప్పులు చెరిగే బంతులతో వణికించారు. బుమ్రా వేసిన తొలి ఓవర్లో మొదటి బంతికే నిస్సంక వికెట్ల ముందు దొరికిపోయాడు.
రెండో ఓవర్ వేసిన సిరాజ్.. లంకకు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. తొలి బంతికే దిముత్ కరుణరత్నెను ఎల్బీగా వెనక్కి పంపిన సిరాజ్.. ఐదో బంతికి లంక కీలక బ్యాటర్ సధీర సమరవిక్రమను ఔట్ చేశాడు. ఇదే ఓవర్లో రెండో బంతికి రివ్యూ తీసుకుని బతికిపోయిన సమరవిక్రమ.. ఐదో బంతికి శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. నాలుగో ఓవర్ వేసిన సిరాజ్.. మరోసారి తొలి బంతికే లంకను దెబ్బతీశాడు. కెప్టెన్ కుశాల్ మెండిస్.. నాలుగో ఓవర్లో మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అనంతరం బౌలింగ్ రేసులోకి వచ్చిన మొహమ్మద్ షమీ తొలి ఓవర్ లోనే వరుస బంతుల్లో శ్రీలంక బ్యాటర్లని పెవిలియన్ కి పంపాడు. మహ్మద్ షమీ బౌలింగ్లో చమీరా పెవిలియన్కు చేరాడు. అసలంక, హేమంత డకౌట్ అయ్యారు. ఏంజెలో మాథ్యూస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
శ్రీలంకతో మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు శుబ్మన్ గిల్(92), విరాట్ కోహ్లి(88), శ్రేయస్ అయ్యర్(82) పరుగులతో అదరగొట్టారు. వీరి ముగ్గురి అద్భుతమైన అర్ధ శతకాలతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు సాధించింది.
లంక బౌలర్లలో పేసర్ మధుషాంక అత్యధికంగా 5 వికెట్లు తీయగా.. దుష్మంత చమీరకు ఒక వికెట్ దక్కింది. రనౌట్ల రూపంలో లంకు రెండు వికెట్లు లభించాయి.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







