గత 9 ఏళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 50 వేల కోట్ల ఎఫ్డిఐ: ప్రధాని మోడీ
- November 03, 2023
న్యూఢిల్లీ: భారత ఆహార శుద్ధి పరిశ్రమ అద్భుతంగా పురోగమిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. గత తొమ్మిదేళ్లలో ఆహార శుద్ధి పరిశ్రమ 50 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే. ఈస్థాయిలో ఎఫ్డీఐలు వచ్చాయని మోడీ తెలిపారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2023ను కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి కుమార్ పరాస్తో కలిసి మోడీ ప్రారంభించారు.
ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసానుంది. వరల్డ్ ఫుడ్ ఇండియా మొదటి ఎడిషన్ 2017లో జరిగగా అనంతరం కొవిడ్ కారణంగా కార్యక్రమం జరగలేదు. మూడురోజులపాటు జరిగే ఈ ఎడిషన్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలోని వివిధ అంశాలపై చర్చించేందుకు 48 సెషన్లు నిర్వహిస్తారు. ఆర్థిక సాధికారత, నాణ్యత హామీ, యంత్రాలు. సాంకేతికతలో ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల సీఈవోలతో సహా 80కిపైగా దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఫుడ్ స్ట్రీట్ను కూడా ప్రారంభించిన ప్రధాని మోడీ . అందులో కలియతిరిగి నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తొమ్మిదేళ్ల ఎన్డీఏ పాలనలో శుద్ధిచేసిన ఆహార ఎగుమతులు 150 శాతం పెరిగాయని తెలిపారు. దేశీయ ప్రాసెసింగ్ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







