పాలస్తీనియన్ల పై ఇజ్రాయెల్ ఊచకోతను ఖండించిన ఒమన్
- November 05, 2023
మస్కట్: పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు కొనసాగిస్తున్న మారణకాండపై ఒమన్ సుల్తానేట్ శనివారం తీవ్రంగా ఖండించింది. పౌరులు మరియు ఆరోగ్య రంగ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర గాజా స్ట్రిప్లోని జబాలియాలోని UNRWAకి అనుబంధంగా ఉన్న అల్-ఫఖౌరా స్కూల్పై బాంబు దాడి జరిగింది. గాజా స్ట్రిప్కు దక్షిణాన ఉన్న రఫాకు తూర్పున అనేక పరిసరాలకు సరఫరా చేసే పబ్లిక్ వాటర్ ట్యాంక్పై బాంబు దాడి జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులకు తెగబడుతుందని, అంతర్జాతీయ ఉల్లంఘనకు ముగింపు పలికేందుకు అంతర్జాతీయ కలిసి రావాలని సుల్తానేట్ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను విచారించడానికి ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయమని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును అభ్యర్థించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







