పసిడి ధర స్వల్పంగా తగ్గింది

- May 24, 2016 , by Maagulf
పసిడి ధర స్వల్పంగా తగ్గింది

దేశీయంగా మంగళవారం పసిడి ధర స్వల్పంగా తగ్గింది. రూ.80 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,570కి చేరింది. డిమాండు తగ్గడంతో నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.45శాతం తగ్గి 1,242.60 యూఎస్‌ డాలర్లకు చేరింది.వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. రూ.80 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.39,500కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో దీని ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 0.67శాతం తగ్గి 16.24 యూఎస్‌ డాలర్లకు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com