మనీలా ఎయిర్పోర్ట్లో భద్రత పెంపు
- May 24, 2016
ఫిలిప్పీన్ యావియేషన్ అథారిటీ, మనీలాలోని నినాయ్ అక్వినో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సౌదీ అరేబియా ఎంబసీ, తమకు అందిన ఓ బెదిరింపు కాల్తో మనీలా అధికారుల్ని అప్రమత్తం చేసింది. సౌదియా విమానాన్ని మిలిటెంట్లు టార్గెట్ చేశారన్నది ఆ బెదిరింపు కాల్ సారాంశం. యెమెన్కి చెందిన 10 మంది మిలిటెంట్లు సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ (సౌదియా)పై టార్గెట్ పెట్టారనే సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లో కనీ వినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంకో వైపు ఈజిప్ట్ ఎయిర్ విమానం 804 గత గురువారం మెడిటేరియన్ సీలో కూలిపోయిన ఘటనకు సంబంధించి తీవ్రవాద కోణాన్ని కొట్టి పారేయలేని పరిస్థితి. బెదిరింపు కాల్, విమానం కూలిపోయిన ఘటన నేపథ్యంలో భద్రతా సిబ్బంది మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మనీలాలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణీకుల తనికీలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









