మనీలా ఎయిర్‌పోర్ట్‌లో భద్రత పెంపు

- May 24, 2016 , by Maagulf
మనీలా ఎయిర్‌పోర్ట్‌లో భద్రత పెంపు

ఫిలిప్పీన్‌ యావియేషన్‌ అథారిటీ, మనీలాలోని నినాయ్‌ అక్వినో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సౌదీ అరేబియా ఎంబసీ, తమకు అందిన ఓ బెదిరింపు కాల్‌తో మనీలా అధికారుల్ని అప్రమత్తం చేసింది. సౌదియా విమానాన్ని మిలిటెంట్లు టార్గెట్‌ చేశారన్నది ఆ బెదిరింపు కాల్‌ సారాంశం. యెమెన్‌కి చెందిన 10 మంది మిలిటెంట్లు సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌ (సౌదియా)పై టార్గెట్‌ పెట్టారనే సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లో కనీ వినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంకో వైపు ఈజిప్ట్‌ ఎయిర్‌ విమానం 804 గత గురువారం మెడిటేరియన్‌ సీలో కూలిపోయిన ఘటనకు సంబంధించి తీవ్రవాద కోణాన్ని కొట్టి పారేయలేని పరిస్థితి. బెదిరింపు కాల్‌, విమానం కూలిపోయిన ఘటన నేపథ్యంలో భద్రతా సిబ్బంది మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మనీలాలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణీకుల తనికీలు నిర్వహిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com