గాజాపై అణుబాంబు హెచ్చరికలు..తీవ్రంగా ఖండించి యూఏఈ
- November 06, 2023
యూఏఈ: గాజా స్ట్రిప్పై అణుబాంబు వేయడంపై ఇజ్రాయెల్ హెరిటేజ్ మంత్రి అమీహై ఎలియాహు చేసిన వివాదస్పద కామెంట్స్ ను యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రకటనలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా యుద్ధ నేరాల వంటి అంతర్జాతీయ మానవతా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించేలా ప్రేరేపిస్తాయని, మారణహోమం చేయాలనే ఉద్దేశ్యంతో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తాయని ఒక ప్రకటనలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) ఆందోళన వ్యక్తం చేసింది. పౌరుల ప్రాణాలను కాపాడడం, వారికి అవసరమైన మానవతా సహాయం అందించడం తక్షణ ప్రాధాన్యత అని యూఏఈ స్పష్టం చేసింది. మరింత ప్రాణనష్టాన్ని నివారించడానికి తక్షణ కాల్పుల విరమణ అవసరాన్ని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో పరిస్థితికి మరింత ఆజ్యం పోయడాన్ని నివారించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని యూఏఈ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









