వేసవి తాపం: స్కూల్ పనివేళల కుదింపు
- May 25, 2016
ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో పలు ప్రైవేటు స్కూళ్ళు తమ పని వేళల్ని తగ్గించుకోగా, మిగతా స్కూళ్ళు కూడా అదే దారిలో పయనించనున్నాయి. జులై నుంచి సుదీర్ఘమైన వేసవి సెలవులకు స్కూల్స్ సన్నద్ధమవుతున్నాయి. జులై నుంచి సెప్టెంబర్ వరకు ఈ సెలవులు ఉంటాయి. ఈసారి సమ్మర్ హాలీడేస్లో ఈద్ హాలీడేస్ కూడా కలుస్తున్నాయి. ఇప్పటిదాకా పని వేళల్ని కుదించని స్కూళ్ళు రంజాన్ ప్రారంభం నుంచి పనివేళల్ని తగ్గించాలని, దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మే 15 నుంచి చాలా వరకు ఇండిపెండెంట్ స్కూల్స్ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో పనివేళల్ని కుదించేశాయి. పనివేళల్ని 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు స్కూళ్ళు తగ్గించాయి. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఈ సంవత్సరం గతంలో కన్నా ఎక్కువ ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పుడే 40 డిగ్రీలకు పైన దోహా సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తాజా వార్తలు
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి









