ప్రపంచకప్ ఫైనల్కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ..!
- November 16, 2023
న్యూ ఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023 తుది అంకానికి చేరుకుంది. వరుస విజయాలు సాధిస్తూ టీమ్ఇండియా ఫైనల్కు దూసుకువెళ్లింది.
ఆదివారం (నవంబర్ 19)న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచింది. 1,32,000 ఈ స్టేడియం కెపాసిటీ. కాగా.. ఈ మ్యాచ్కు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటుగా పలువురు కేంద్రమంత్రులు, భారత మాజీ క్రికెటర్లు, వివిధ రంగాల సెలబ్రిటీలు మ్యాచును వీక్షించేందుకు రానున్నారు.
టీమ్ఇండియాకు ప్రత్యేక అభినందనలు తెలిపిన ప్రధాని..వాంఖడే వేదికగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమ్ఇండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం టీమ్ఇండియా ప్రదర్శన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 'భారత జట్టుకు అభినందనలు. అత్యుత్తమ ప్రదర్శనతో విశేషమైన శైలిలో ఫైనల్స్లో అడుగుపెట్టింది. అద్భుతమైన బ్యాటింగ్, మంచి బౌలింగ్ మన జట్టుకు మ్యాచ్ను అందించింది. ఫైనల్ మ్యాచ్కు శుభాకాంక్షలు.'అని ప్రధాని మోదీ సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్







