ఇన్ఫ్లుయెన్సర్లందరూ 9 శాతం కార్పొరేట్ పన్ను చెల్లించాలి..
- November 17, 2023
యూఏఈ: యూఏఈ-ఆధారిత ఇన్ఫ్లుయెన్సర్లందరూ 9 శాతం కార్పొరేట్ పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా ఫెడరల్ టాక్స్ అథారిటీలో నమోదు చేసుకోవాలి. యూఏఈ యొక్క ఫెడరల్ డిక్రీ-లా నం. 47 ఆఫ్ కార్పొరేషన్లు మరియు వ్యాపారాల పన్నుపై చేసిన చట్టం 2022 జూన్ 1, 2023 నుండి అమలులోకి వచ్చింది. దీని ద్వారా మొట్టమొదటి ఫెడరల్ కార్పొరేట్ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. యూఏఈలో సంవత్సరానికి AED375,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తులు అందరూ తప్పక 9 శాతం కార్పొరేట్ పన్ను చెల్లించాలి. అలాగే టాక్స్ కట్టే వారందరూ ఫెడరల్ టాక్స్ అథారిటీలో నమోదు చేసుకోవాలి. "యూఏఈలో లాభాలను ఆర్జించే లక్ష్యంతో పనిచేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లందరూ కార్పొరేట్ పన్ను చట్టం పరిధిలోకి వస్తారు కాబట్టి, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA)లో నమోదు చేసుకోవడం, వారి ఆదాయాలను నివేదించడం తప్పనిసరి." అని BSA లీగల్లో అసోసియేట్ మరూన్ అబౌ హర్బ్ తెలిపారు. EMARATAX ప్లాట్ఫారమ్లో కార్పొరేట్ పన్ను రిజిస్ట్రేషన్ నంబర్ (CTRN)ని పొందేందుకు టాక్స్ పేయర్స్ అందరూ తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పన్ను చెల్లింపు నుండి మినహాయించబడిన వారు కూడా, సంబంధిత పన్ను వ్యవధి ముగిసిన తొమ్మిది నెలలలోపు అన్ని సంబంధిత సహాయక డాక్యుమెంటేషన్లతో సహా ప్రతి పన్ను కాలానికి పన్ను రిటర్న్ను ఫైల్ చేయాలని చెప్పారు. పన్ను ఎగవేతదారులకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే ప్రమాదం ఉందన్నారు. అలాగే పన్ను ఎగవేత మొత్తానికి మూడు రెట్లు జరిమానా విధించవచ్చని అబౌ హర్బ్ చెప్పారు. కొన్ని సందర్భాల్లో క్రిమినల్ పెనాల్టీలతో పాటు పన్ను ఎగవేతదారులు చెల్లించని పన్నుపై వడ్డీ మరియు జరిమానాలు వంటి సివిల్ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. వ్యాపారులు లేదా వ్యక్తులు కార్పొరేట్ పన్ను నియమాలను జాగ్రత్తగా పాటించాలి. ఆలస్యమైన లేదా మిస్సింగ్ అయిన రిజిస్ట్రేషన్, డీరిజిస్ట్రేషన్, పన్ను రిటర్న్లు, డిక్లరేషన్లు మరియు చెల్లింపులకు జరిమానాలు ఎదురుకోవాల్సి వుంటుంది. వీటితో పాటు సరైన రికార్డులను మెయింటెయిన్ చేయక పోవడం, పునరావృతమైన నేరాలు, తప్పు రిటర్నులను సమర్పించడం వంటి వాటికి అధిక జరిమానాలు విధించే అవకాశం ఉంద. అలాగే అధికారులకు అరబిక్ పత్రాలను అందించడంలో విఫలమైన వారు కూడా జరిమానాలను ఎదుర్కొంటారని మరూన్ అబౌ హర్బ్ వివారించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







