యూఏఈ గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
- November 21, 2023
యూఏఈ: గల్ఫ్ సేన జనసేన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీం ఆధ్వర్యంలో అల్ అయిన్ లో జరిగిన మెగా రక్తదానం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా హాజరైన జనసైనికులు మరియు వీర మహిళలు దాదాపు 70 కి పైగా మంది రక్తదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గల్ఫ్ దేశాల జనసేన ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు మరియు జాతీయ కన్వీనర్ చంద్రశేఖర్ మొగళ్ల్ల రక్తదానం చేసిన జనసైనికులకు జనసేన పార్టీ గుర్తు అయినటువంటి గాజు గ్లాసు మరియు జనసేన పార్టీ నుండి వారికి అభినందన పత్రం అందజేశారు. అలాగే రక్త దానం చేసిన వారిని ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు అభినందించారు.జనసేన పార్టీ 2024 లో గెలుపు కోసం గల్ఫ్ నుండి చేయవలసిన కార్యక్రమాలు కార్యకర్తలకు వివరించారు. అలాగే డిసెంబర్10న జరిగే గల్ఫ్ జనసేన పోస్టర్ ను ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









