యూఏఈ గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
- November 21, 2023
యూఏఈ: గల్ఫ్ సేన జనసేన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీం ఆధ్వర్యంలో అల్ అయిన్ లో జరిగిన మెగా రక్తదానం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా హాజరైన జనసైనికులు మరియు వీర మహిళలు దాదాపు 70 కి పైగా మంది రక్తదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గల్ఫ్ దేశాల జనసేన ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు మరియు జాతీయ కన్వీనర్ చంద్రశేఖర్ మొగళ్ల్ల రక్తదానం చేసిన జనసైనికులకు జనసేన పార్టీ గుర్తు అయినటువంటి గాజు గ్లాసు మరియు జనసేన పార్టీ నుండి వారికి అభినందన పత్రం అందజేశారు. అలాగే రక్త దానం చేసిన వారిని ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు అభినందించారు.జనసేన పార్టీ 2024 లో గెలుపు కోసం గల్ఫ్ నుండి చేయవలసిన కార్యక్రమాలు కార్యకర్తలకు వివరించారు. అలాగే డిసెంబర్10న జరిగే గల్ఫ్ జనసేన పోస్టర్ ను ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







