యూఏఈ గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
- November 21, 2023
యూఏఈ: గల్ఫ్ సేన జనసేన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీం ఆధ్వర్యంలో అల్ అయిన్ లో జరిగిన మెగా రక్తదానం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా హాజరైన జనసైనికులు మరియు వీర మహిళలు దాదాపు 70 కి పైగా మంది రక్తదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గల్ఫ్ దేశాల జనసేన ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు మరియు జాతీయ కన్వీనర్ చంద్రశేఖర్ మొగళ్ల్ల రక్తదానం చేసిన జనసైనికులకు జనసేన పార్టీ గుర్తు అయినటువంటి గాజు గ్లాసు మరియు జనసేన పార్టీ నుండి వారికి అభినందన పత్రం అందజేశారు. అలాగే రక్త దానం చేసిన వారిని ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు అభినందించారు.జనసేన పార్టీ 2024 లో గెలుపు కోసం గల్ఫ్ నుండి చేయవలసిన కార్యక్రమాలు కార్యకర్తలకు వివరించారు. అలాగే డిసెంబర్10న జరిగే గల్ఫ్ జనసేన పోస్టర్ ను ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







