యూఏఈ గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
- November 21, 2023
యూఏఈ: గల్ఫ్ సేన జనసేన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీం ఆధ్వర్యంలో అల్ అయిన్ లో జరిగిన మెగా రక్తదానం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా హాజరైన జనసైనికులు మరియు వీర మహిళలు దాదాపు 70 కి పైగా మంది రక్తదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గల్ఫ్ దేశాల జనసేన ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు మరియు జాతీయ కన్వీనర్ చంద్రశేఖర్ మొగళ్ల్ల రక్తదానం చేసిన జనసైనికులకు జనసేన పార్టీ గుర్తు అయినటువంటి గాజు గ్లాసు మరియు జనసేన పార్టీ నుండి వారికి అభినందన పత్రం అందజేశారు. అలాగే రక్త దానం చేసిన వారిని ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు అభినందించారు.జనసేన పార్టీ 2024 లో గెలుపు కోసం గల్ఫ్ నుండి చేయవలసిన కార్యక్రమాలు కార్యకర్తలకు వివరించారు. అలాగే డిసెంబర్10న జరిగే గల్ఫ్ జనసేన పోస్టర్ ను ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!







