బుర్జ్ అల్ అరబ్ టెర్రాస్ని ప్రారంభించిన మొహమ్మద్
- May 25, 2016
వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూఏఈ, మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్ - బుర్జ్ అల్ అరబ్ టెర్రాస్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే తొలిసారిగా సముద్రంలో నిర్మించిన భారీ నిర్మాణాల సముదాయమిది. అత్యద్భుతమైన హాస్పిటాలిటీ ఈ బుర్జ్ అల్ అరబ్ టెర్రాస్ సొంతం. దుబాయ్ హోల్డింగ్ మెంబర్ అయిన గ్లోబల్ లగ్జరీ హోటల్ కంపెనీ జుమైరా గ్రూప్ ఈ బుర్జ్ అల్ అరబ్ని నిర్వహిస్తోంది. దుబాయ్ ల్యాండ్ మార్క్గా ఈ బుర్జ్ అల్ అరబ్ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోనుంది. టెర్రాస్ని బుర్జ్ అల్ అరబ్ ప్రతిబింబంలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్, ఈ కాన్సెప్ట్ని అభినందించారు. ఈ తరహా క్రియేటివిటీతో కూడిన నిర్మాణాలనీ, హాస్పిటాలిటీనీ యూఏఈ మరియు దుబాయ్ ప్రోత్సహిస్తూనే ఉంటాయని చెప్పారాయన. 5000 టన్నుల కృత్రిమ ద్వీపాన్ని ఫిన్లాండ్లోని షిప్యార్డ్ సైట్లో నిర్మించి, దాన్ని బఎనిమిది భాగాలుగా దుబాయ్కి షిప్పింగ్ చేశారు. దుబాయ్ హోల్డింగ్ వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ బియాత్, షేక్ మొహమ్మద్ సపోర్ట్ని కొనియాడారు. సరికొత్త ఆవిష్కరణలకు షేక్ మొహమ్మద్ ఇస్తున్న సపోర్ట్ మరువలేనిదని ఆయన చెప్పారు. హాస్పిటాలిటీ, టూరిజం రంగాల్లో దూసుకపోవడమే కాకుండా, ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని చెప్పారాయన.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







