వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా విజయ సాయిరెడ్డి

- May 25, 2016 , by Maagulf
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా విజయ సాయిరెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఆపార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి పేరు ఖరారు అయింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో సుదీర్ఘ భేటీ అనంతరం అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విజయ సాయిరెడ్డి పేరును ప్రకటించారు.విజయ సాయిరెడ్డి ఎంపిక పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఆయనకు తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు మద్దతు తెలిపినవారికి విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నామినేషన్ వేసేందుకు విజయ సాయిరెడ్డితో పాటు పార్టీ నేతలు.. అసెంబ్లీకి బయల్దేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com