ఎల్లుండి రైతు ఖాతాల్లో రైతుబంధు జమ
- November 26, 2023
హైదరాబాద్: రైతుబంధు కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో ఆ డబ్బులు ఎప్పుడు పడతాయో..అని రైతులంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎల్లుండి (నవంబర్ 28) సాయంత్రం 5 గంటలోపు రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయాలనీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈరోజు, రేపు బ్యాంకులకు సెలవులు ఉండడంతో ఎల్లుండి జమ చేయబోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించిన నిధులు జమ చేసినప్పటికీ.. యాసంగి సీజన్ కోసం రెండో విడత నిధులు నవంబర్లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ రావడంతో కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.
ఎన్నికల ముందు రైతుబంధు నగదు పంపిణీకి అనుమతి ఇవ్వకూడదని, అది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలంగాణ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి, సీఈవోకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల ముందు రైతుబంధు నిధులు బదిలీ చేయకుండా చర్యలు తీసుకోవాలని అటు ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నర్స్’ సంస్థ కూడా ఈసీని ఆశ్రయించింది.
రైతుబంధు కింద నగదు బదిలీకి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరింది. రాష్ట్రంలో రైతుబంధు ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పథకమని, ఇది కొత్తదేమీ కాదని వివరణ ఇచ్చింది. ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం చివరికి రైతుబంధు నిధుల పంపిణీకి అనుమతి ఇస్తూ శుక్రవారం (నవంబర్ 24) ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







