బీఆర్ఎస్, కాంగ్రెస్లను ప్రజలు తరిమికొడతారు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
- November 26, 2023
హైదరాబాద్: ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మేస్థితిలో లేరని, ఆ పార్టీలను ప్రజలు తరిమికొట్టనున్నారని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి హెచ్చరించారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు బీజేపీకి అండగా నిలుస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాచిగూడ లింగంపల్లిలోని వినాయక ఆలయం నుంచి రోడ్షో నిర్వహించారు. సి.కృష్ణాయాదవ్, ఎన్.గౌతమ్రావు, కార్పొరేటర్లు క న్నె ఉమాదేవి, వై.అమృత రోడ్షో నిర్వహించారు. యువమోర్చా కార్యకర్తలు జీపు వెంట బైక్లపై ర్యాలీగా వెళ్లారు. కన్నె రమేష్యాదవ్, ఎక్కాల నందు, నందకిషోర్యాదవ్, సి.వినోద్యాదవ్, దడిగె జగన్యాదవ్, ఏ.సూర్యప్రకా్షసింగ్, ఎడెల్లి అజయ్కుమార్, కృష్ణకుమార్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అంబర్పేట బీజేపీ అభ్యర్థి, కృష్ణాయాదవ్ అన్నారు. గోల్నాక రోడ్లోని సల్వా గార్డెన్ ఫంక్షన్హాల్లో కుట్టుమిషన్ కార్మికుల సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు బీజేపీ పట్ల మెగ్గుచూపుతున్నారని తెలిపారు. సమ్మేళనంలో క్షీర్సాగర్, కృష్ణ, శ్రీను, వెంకటేష్, అరవింద్, గోవింద్, శ్రీనివాస్, నరేందర్, సుబ్రహ్మణ్యం, అర్చన, లావణ్య, ఈశ్వరి, నిర్మల, గీ, రేఖ, బీజేపీ డివిజన్ కన్వీనర్ మూల రవీందర్గౌడ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







