బీఆర్ఎస్, కాంగ్రెస్లను ప్రజలు తరిమికొడతారు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
- November 26, 2023
హైదరాబాద్: ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మేస్థితిలో లేరని, ఆ పార్టీలను ప్రజలు తరిమికొట్టనున్నారని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి హెచ్చరించారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు బీజేపీకి అండగా నిలుస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాచిగూడ లింగంపల్లిలోని వినాయక ఆలయం నుంచి రోడ్షో నిర్వహించారు. సి.కృష్ణాయాదవ్, ఎన్.గౌతమ్రావు, కార్పొరేటర్లు క న్నె ఉమాదేవి, వై.అమృత రోడ్షో నిర్వహించారు. యువమోర్చా కార్యకర్తలు జీపు వెంట బైక్లపై ర్యాలీగా వెళ్లారు. కన్నె రమేష్యాదవ్, ఎక్కాల నందు, నందకిషోర్యాదవ్, సి.వినోద్యాదవ్, దడిగె జగన్యాదవ్, ఏ.సూర్యప్రకా్షసింగ్, ఎడెల్లి అజయ్కుమార్, కృష్ణకుమార్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అంబర్పేట బీజేపీ అభ్యర్థి, కృష్ణాయాదవ్ అన్నారు. గోల్నాక రోడ్లోని సల్వా గార్డెన్ ఫంక్షన్హాల్లో కుట్టుమిషన్ కార్మికుల సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు బీజేపీ పట్ల మెగ్గుచూపుతున్నారని తెలిపారు. సమ్మేళనంలో క్షీర్సాగర్, కృష్ణ, శ్రీను, వెంకటేష్, అరవింద్, గోవింద్, శ్రీనివాస్, నరేందర్, సుబ్రహ్మణ్యం, అర్చన, లావణ్య, ఈశ్వరి, నిర్మల, గీ, రేఖ, బీజేపీ డివిజన్ కన్వీనర్ మూల రవీందర్గౌడ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







