పసిడి ధర గురువారం స్వల్పంగా పెరిగింది

- May 26, 2016 , by Maagulf
పసిడి ధర గురువారం స్వల్పంగా పెరిగింది

పసిడి ధర గురువారం స్వల్పంగా పెరిగింది. బుధవారం ఆరువారాల కనిష్ఠానికి చేరిన దీని ధర ఈ రోజు రూ.25 పెరిగింది. దీంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,225కు చేరింది. ప్రపంచ మార్కెట్లలో ధర పెరుగుతుండటం, దేశీయంగా రీటైల్‌ మార్కెట్లలో కొనుగోళ్లు వూపందుకోవడంతో నగల వ్యాపారులు కొనుగోళ్లకు దిగడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.8శాతం పెరిగి 1,234.36 యూఎస్‌ డాలర్లకు చేరింది.వరసగా ఎనిమిది రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ఈ రోజు మాత్రం పెరిగింది. రూ.150 పెరగడంతో కేజీ వెండి ధర రూ.39,600కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com