పసిడి ధర గురువారం స్వల్పంగా పెరిగింది
- May 26, 2016
పసిడి ధర గురువారం స్వల్పంగా పెరిగింది. బుధవారం ఆరువారాల కనిష్ఠానికి చేరిన దీని ధర ఈ రోజు రూ.25 పెరిగింది. దీంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,225కు చేరింది. ప్రపంచ మార్కెట్లలో ధర పెరుగుతుండటం, దేశీయంగా రీటైల్ మార్కెట్లలో కొనుగోళ్లు వూపందుకోవడంతో నగల వ్యాపారులు కొనుగోళ్లకు దిగడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.8శాతం పెరిగి 1,234.36 యూఎస్ డాలర్లకు చేరింది.వరసగా ఎనిమిది రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ఈ రోజు మాత్రం పెరిగింది. రూ.150 పెరగడంతో కేజీ వెండి ధర రూ.39,600కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయడంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









