హరియాణాలో బాంబు పేలుడు

- May 26, 2016 , by Maagulf
హరియాణాలో  బాంబు పేలుడు

హరియాణాలోని ఓ ప్రభుత్వ రవాణా బస్సులో గురువారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. అయితే ఇది ఉగ్రవాదుల దాడి అని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే..   

 కురుక్షేత్రలోని ఓ బస్సులో బాంబు పేలుడు సంభవించింది. అయితే బాంబు తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారమందుకున్న దర్యాప్తు దర్యాప్తు సంస్థ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బస్సులోని ఓ బ్యాగులో దుస్తుల కింద బాంబును దాచి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనేనని.. అయితే ఏ ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడిందన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com