ఎక్స్పో 2030 హోస్టింగ్ బిడ్ గెలిచిన సౌదీ అరేబియా
- November 29, 2023
రియాద్: రియాద్ ఎక్స్పో 2030 వరల్డ్ ఫెయిర్కు సౌదీ అరేబియాలోని ఆతిథ్యం ఇవ్వనుంది. బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్పోజిషన్స్లోని 182 మంది సభ్యుల ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో 119 ఓట్లు సౌదీ అరేబియాకు మద్దతుగా పడ్డాయి. దక్షిణ కొరియాకు చెందిన బుసాన్, ఇటలీకి చెందిన రోమ్లు కూడా ఐదేళ్లకోసారి జరిగే ప్రపంచ ఉత్సవానికి ఆతిథ్యం ఇవ్వడానికి పోటీలో నిలిచాయి. హై-ప్రొఫైల్ షోడౌన్లో రోమ్, బుసాన్ మరియు రియాద్ 2030 వరల్డ్ ఎక్స్పోకు హోస్ట్ సిటీగా రేసులో ఉన్నాయి. ఆర్గనైజింగ్ బాడీ విజేతను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. ఎక్స్పో 2025 జపాన్లోని ఒసాకాలో జరగనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..







