దుబాయ్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన భారత ప్రవాసులు
- December 01, 2023
దుబాయ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం దుబాయ్లో అడుగుపెట్టారు. యూఏఈ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న COP28 సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. విమానాశ్రయంలో యూఏఈ అంతర్గత మంత్రి, ఉప ప్రధాని షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాన మంత్రి ప్రపంచ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారని, వాతావరణ చర్యలను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
ప్రధాని మోదీ హోటల్కు చేరుకోగానే యూఏఈలోని ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ‘మోదీ, మోదీ’, ‘అబ్కీ బార్ మోదీ సర్కార్’, ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేసారు. ప్రధాని వారితో సంభాషించి, అభివాదం చేస్తూ వెళ్లారు. దుబాయ్లోని భారతీయ కమ్యూనిటీ నుండి వచ్చిన ఘనస్వాగతం తనను ఎంతో కదిలించిందని ప్రధాని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. "COP28 సమ్మిట్లో పాల్గొనేందుకు దుబాయ్లో ల్యాండ్ అయ్యాను. మెరుగైన భూమండలాన్ని సృష్టించే లక్ష్యంతో జరిగే సమ్మిట్ కార్యకలాపాల కోసం ఎదురు చూస్తున్నాను" అని ప్రధాని మోదీ X లో ట్వీట్ చేశారు.
వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ అనేది COP28 ఉన్నత-స్థాయి విభాగం. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి మరియు వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మార్గాలను చర్చించడానికి పలువురు ప్రపంచ దేశాధినేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రధాని మోదీ మూడు అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. COP28 నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు యూఏఈ అధ్యక్షతన జరుగుతోంది.
Deeply moved by the warm welcome from the Indian community in Dubai. Their support and enthusiasm is a testament to our vibrant culture and strong bonds. pic.twitter.com/xQC64gcvDJ
— Narendra Modi (@narendramodi) November 30, 2023
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









