విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ సీరియస్
- December 07, 2023
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి క్యాబినెట్ సమావేశం చాలా సీరియస్ గా సాగింది. విద్యుత్ శాఖపై రివ్యూ సీరియస్ గా సాగింది. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
రేపటిలోగా(డిసెంబర్ 8) పూర్తి వివరాలతో రావాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. రేపు(డిసెంబర్ 8) ఉదయం విద్యుత్ పై సీఎం రేవంత్ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎంకు చెప్పారు అధికారులు. మరోవైపు ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. రేపటి రివ్యూకు ప్రభాకర్ రావును రప్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







