కేసీఆర్ ఆరోగ్యం పై సీఎం రేవంత్ ఆరా..
- December 08, 2023
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్కు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి, ఆయనకు అందుతున్న వైద్యం గురించి యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని యశోద వైద్యులు తెలిపారు.
వాస్తవానికి ఈ విషయం రాత్రే ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసన వెంటనే ప్రభుత్వం స్పందించంది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆరోగ్యం గురించి ప్రభుత్వ ఆరోగ్య శాఖ పరిశీలిస్తూనే ఉంది.
తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు. అంతే కాకుండా, ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం మరోసారి తిరగబడిందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆయనను యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే సెక్రటేరియట్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో విద్యుత్ శాఖపై అత్యున్నత సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం
- ఈనెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..
- వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్లో భారీ మార్పులు
- ఏప్రిల్ నుండి ఫేస్బుక్ మెసెంజర్ క్లోజ్..!!
- గాజా శాంతి, పునర్నిర్మాణ ప్రయత్నాలకు మద్దతు ..!!
- హోం బేస్డ్ గ్రోసరీ స్టోర్లు మూసివేత..!!
- రద్దీ నివారణకు ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..!!
- మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?









