మరోసారి కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్
- December 08, 2023
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా రెపోరేటును 6.5 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచడం వరుసగా ఇది ఐదో సారి. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు.
2023 సంవత్సరం ముగింపునకు వచ్చిన వేళ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ భావిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని.. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందని.. కానీ, ఆహార ద్రవ్యోల్బణంలో మాత్రం రిస్క్ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు. దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచుతున్నట్లు ఈ సమావేశంలో నిర్ణయించినట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







