బుర్ర ఉపయోగించి తాళం వేసిన బస్సులోంచి బైటపడ్డ బాలుడు
- May 27, 2016
మస్కట్ : ఒక పదేళ్ళ బాలుడు తన తెలివితేటలను ఉపయోగించడమే కాక ధైర్యం చూపి తాళం వేసిన ఒక పాఠశాల బస్సులోంచి క్షేమంగా బైటపడ్డ వైనం బుధవారం ఉదయం వెలుగు చూసింది. సేకరించిన వివరాల ప్రకారం భారతీయ పాఠశాల విద్యార్థి పాఠశాలకు చెందిన బస్సులో కాసేపు కునుకు తీసాడుఅతను నిద్రలేచే సమయానికి సహచర విద్యార్ధులందరూ వెళ్ళిపోయారు.బస్సు సైతం నిలిపి వెలుపలకు వచ్చే తలుపు తాళం వేసి ఉంది. అందరు విద్యార్థులు దిగేరా లేదా అని డ్రైవర్ తనిఖీ చేసుకోకుండా బస్సు తలపునకు తాళం వేసి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
" నా పెద్ద కుమారుడుతో పాటు పది మంది విద్యార్ధులు ఉదయం సుమారు 5.50 సమయంలో మినీబస్సు ఎక్కిన సీనియర్ పాఠశాల భవనం వద్ద మొదటి వెలుగు వచ్చేలోపు అక్కడ ఉంటారని చెప్పాడు. " తన సీటులో నిద్ర పోతున్న నా కుమారుడిని బస్సు డ్రైవర్ గమనించినట్లు లేదని విద్యార్ధి యొక్క తండ్రి పేర్కొన్నారు
విద్యార్ధి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం "నా కుమారుడు సహాయం కోసం ఎంతో అరిచాడు. ఎవరి వద్ద నుంచి ప్రతిస్పందన రాలేదు. దాంతో అతను బస్సు కిటికీ తెరిచి వెంటనే వాహనం మీదనుంచి దూకి తనను తాను రక్షించుకొన్నాడు. "విద్యార్ధి పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్ పై పాఠశాల అధికారులకు ఫిర్యాదు దాఖలు చేస్తున్నట్లు తెలిపాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







