పవర్, వాటర్ పొదుపుకి 'దెవా' బహుమతి
- May 27, 2016
దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దెవా) వినియోగదారులకు బహుమతులు ఇవ్వనుంది. అయితే ఈ బహుమతులు అందుకోవడానికి వినియోగదారులు నీటిని, విద్యుత్ని ఆదా చెయ్యవలసి ఉంటుంది. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 2016 లోపు తమ ఎలక్ట్రిసిటీ బిల్లులపై 15 శాతం కనీసం ఆదా చేయగలిగినవారు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హత పొందుతారు. అలా అర్హత సాధించినవారిలో కొందరిని ఎంపిక చేసి బహుమతులు, ఓ ప్రశంసా పత్రం అందజేయబడతాయి. బహుమతులు 15,000 దిర్హామ్లు (ఫస్ట్ ప్లేస్), 10,000 (రెండో ప్లేస్), 5,000 (మూడో ప్లేస్) గా నిర్ణయించారు. రెండు కేటగిరీల్లో ఈ బహుమతుల్ని అందజేస్తారు. వినియోగదారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు దెవా వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఓ టీమ్, వినియోగదారుల బిల్లుల్ని పర్యవేక్షిస్తుంది. గత ఏడాదితో ఈ ఏడాది బిల్లుల్ని ఈ టీమ్ పోల్చి చూస్తుంది. గత సంవత్సరం 6,008 వినియోగదారులు ఈ పోటీలో పాల్గొని 3 మిలియన్ కెడబ్ల్యుహెచ్ విద్యుత్ని, 29 మిలియన్ గ్యాలన్ల నీటిని ఆదా చేశారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







