కేసీఆర్ను పరామర్శించిన చంద్రబాబు
- December 11, 2023
హైదరాబాద్: తుంటి గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమవారం(డిసెంబర్ 11) హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు.. కేసీఆర్ తో మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా కేసీఆర్ ని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. అటు కేసీఆర్ కు అందుతున్న ట్రీట్ మెంట్ గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు అన్నారు. కేసీఆర్ తొందరలోనే కోలుకుంటారని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు చంద్రబాబు. డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం కేసీఆర్ తొందరలోనే కోలుకుంటారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మామూలుగా తిరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ అంకితమైన భావంతో ప్రజల కోసం పని చేయాలని చంద్రబాబు కోరుకున్నారు.
కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. మూడు రోజుల క్రితం ఆయనకు యశోద ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ థియేటర్ నుంచి కేసీఆర్ ను ఐసీయూకి షిఫ్ట్ చేశారు. కేసీఆర్ ను కలిసి పరామర్శించేందుకు కేవలం వీఐపీలకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ ఉదయం నుంచి కేసీఆర్ ను పలువురు మాజీ మంత్రులు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
కాగా, ఆసుపత్రి చికిత్స పొందుతున్న కేసీఆర్ ను ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని 9వ ఫ్లోర్ లో కేసీఆర్ కు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. కేసీఆర్ ను రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి(డిసెంబర్ 13) ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ విమానాల రాకపోకలు బంద్
- వాట్సాప్లో ఏఐ స్కామ్ అలర్ట్ ఫీచర్..
- ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్







