చైల్డ్ ప్రాసిక్యూషన్కి అబుదాబీ ఏర్పాట్లు
- May 27, 2016
అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ఎడిజెడి) ఫ్యామిలీ ప్రాసిక్యూషన్తోపాటు చిన్న పిల్లలకు సంబంధించిన కేసుల విచారణకు సరికొత్త బ్రాంచ్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. యూఏఈ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్, చైర్మన్ ఆఫ్ అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట& షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచన మేరకు యూఏఈ చిల్డ్రన్ రైట్స్ లా (వుదీమా)ను ఏర్పాటు చేశారు. జూన్ 15 నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. తన తండ్రి గర్ల్ఫ్రెండ్ పెట్టిన చిత్రహింసలతో మరణించిన ఎనిమిదేళ్ళ ఎమిరేటీ బాలిక గుర్తుగా ఈ వుదీమా చట్టాన్ని రూపొందించారు. పసి పిల్లలపై పెరుగుతున్న వేధింపులు, నేరాలకు ఈ చట్టం అడ్డుకట్ట వేస్తుందనీ, ఫ్యామిలీ కోర్టు పరిధిలోకి ఈ కేసులు విచారణకు వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి కేసుల్లో దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోమని చట్టం చెబుతుంది. పసి పిల్లలకు సంబంధించి ఫిజికల్, సైకలాజికల్, మోరల్ మరియు మెంటల్ ప్రొటెక్షన్ ఈ చట్టం తాలూకు సిద్ధాంతం
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









