చైల్డ్ ప్రాసిక్యూషన్కి అబుదాబీ ఏర్పాట్లు
- May 27, 2016
అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ఎడిజెడి) ఫ్యామిలీ ప్రాసిక్యూషన్తోపాటు చిన్న పిల్లలకు సంబంధించిన కేసుల విచారణకు సరికొత్త బ్రాంచ్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. యూఏఈ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్, చైర్మన్ ఆఫ్ అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట& షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచన మేరకు యూఏఈ చిల్డ్రన్ రైట్స్ లా (వుదీమా)ను ఏర్పాటు చేశారు. జూన్ 15 నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. తన తండ్రి గర్ల్ఫ్రెండ్ పెట్టిన చిత్రహింసలతో మరణించిన ఎనిమిదేళ్ళ ఎమిరేటీ బాలిక గుర్తుగా ఈ వుదీమా చట్టాన్ని రూపొందించారు. పసి పిల్లలపై పెరుగుతున్న వేధింపులు, నేరాలకు ఈ చట్టం అడ్డుకట్ట వేస్తుందనీ, ఫ్యామిలీ కోర్టు పరిధిలోకి ఈ కేసులు విచారణకు వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి కేసుల్లో దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోమని చట్టం చెబుతుంది. పసి పిల్లలకు సంబంధించి ఫిజికల్, సైకలాజికల్, మోరల్ మరియు మెంటల్ ప్రొటెక్షన్ ఈ చట్టం తాలూకు సిద్ధాంతం
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







