చంద్రబాబు పై లక్ష్మీ పార్వతి ధ్వజం
- May 27, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్టీని చంద్రబాబు నక్కల పాలు, కుక్కల పాలు చేశారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత శనివారంనాడు ఆమె మీడియాతో మాట్లాడారు.పార్టీ చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దూరమై పోయిందని, పార్టీ విధానాలను చంద్రబాబు భూస్థాపితం చేశారని ఆమె విరుచుకుపడ్డారు. చంద్రబాబు అవినీతి చిట్టా ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ఉందని, ఓటుకు నోటు కేసు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతిలో ఉందని, దీంతో చంద్రబాబు ప్రత్యేక హోదాపై గానీ జలాలపై గానీ పోరాటం చేయలేరని ఆమె అన్నారు.కేవలం పార్టీ పేరు చెప్పుకుని చంద్రబాబు బతుకున్నారని, ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావించడానికి వీలు లేని స్థితికి పార్టీని దిగజార్చారని ఆమె అన్నారు.తిరుపతి టౌన్ క్లబ్ సెంటర్లో చంద్రబాబు, బాలకృష్ణ, బొజ్జల గోపాల కృష్ణారెడ్డిలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బడుగు, బలహీనవర్గాల కోసం ఎన్టీఆర్ అహర్నిశలు కృషి చేశారని, అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్నారని బాలకృష్ణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







