భారత విదేశాంగ మంత్రితో సుల్తాన్ భేటీ
- December 16, 2023
న్యూ ఢిల్లీ: భారత్ లో పర్యటిస్తున్న హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుక్రవారం న్యూ ఢిల్లీలోని తన రెసిడెన్సీలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భాం ఒమన్, ఇండియా మధ్య ఉన్న అధునాతన సంబంధాలను, వాటిని వివిధ రంగాలలో ప్రోత్సహించే మార్గాలను వారు సమీక్షించారు. అలాగే ఉమ్మడి ఆందోళన కలిగించే ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో ఒమనీ వైపు నుండి విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ, భారతదేశంలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీ హాజరయ్యారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కాన్సులర్, పాస్పోర్ట్, వీసా & విదేశీ భారతీయ వ్యవహారాల కార్యదర్శి ముక్తేష్ పరదేశి, విదేశీ వ్యవహారాల శాఖ (గల్ఫ్ ప్రాంతం) జాయింట్ సెక్రటరీ అసీమ్ రాజా మహాజన్, ఒమన్లో భారత రాయబారి అమిత్ నారంగ్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి
- ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు
- ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీల పై నిషేధం..!!
- రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!









