భారత విదేశాంగ మంత్రితో సుల్తాన్ భేటీ
- December 16, 2023
న్యూ ఢిల్లీ: భారత్ లో పర్యటిస్తున్న హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుక్రవారం న్యూ ఢిల్లీలోని తన రెసిడెన్సీలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భాం ఒమన్, ఇండియా మధ్య ఉన్న అధునాతన సంబంధాలను, వాటిని వివిధ రంగాలలో ప్రోత్సహించే మార్గాలను వారు సమీక్షించారు. అలాగే ఉమ్మడి ఆందోళన కలిగించే ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో ఒమనీ వైపు నుండి విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ, భారతదేశంలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీ హాజరయ్యారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కాన్సులర్, పాస్పోర్ట్, వీసా & విదేశీ భారతీయ వ్యవహారాల కార్యదర్శి ముక్తేష్ పరదేశి, విదేశీ వ్యవహారాల శాఖ (గల్ఫ్ ప్రాంతం) జాయింట్ సెక్రటరీ అసీమ్ రాజా మహాజన్, ఒమన్లో భారత రాయబారి అమిత్ నారంగ్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







