భారత విదేశాంగ మంత్రితో సుల్తాన్ భేటీ
- December 16, 2023![1 భారత విదేశాంగ మంత్రితో సుల్తాన్ భేటీ](https://www.maagulf.com/godata/articles/202312/gg_1702711122.jpg)
న్యూ ఢిల్లీ: భారత్ లో పర్యటిస్తున్న హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుక్రవారం న్యూ ఢిల్లీలోని తన రెసిడెన్సీలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భాం ఒమన్, ఇండియా మధ్య ఉన్న అధునాతన సంబంధాలను, వాటిని వివిధ రంగాలలో ప్రోత్సహించే మార్గాలను వారు సమీక్షించారు. అలాగే ఉమ్మడి ఆందోళన కలిగించే ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో ఒమనీ వైపు నుండి విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ, భారతదేశంలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీ హాజరయ్యారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కాన్సులర్, పాస్పోర్ట్, వీసా & విదేశీ భారతీయ వ్యవహారాల కార్యదర్శి ముక్తేష్ పరదేశి, విదేశీ వ్యవహారాల శాఖ (గల్ఫ్ ప్రాంతం) జాయింట్ సెక్రటరీ అసీమ్ రాజా మహాజన్, ఒమన్లో భారత రాయబారి అమిత్ నారంగ్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..