ఇజ్రాయిల్ మొసాద్ ఏజెంట్కు ఉరి
- December 17, 2023
టెహ్రాన్: ఇజ్రాయిల్ మొసాద్ ఇంటెలిజెన్స్ సర్వీస్కి చెందిన ఏజెంట్ను ఆగేయ ఇరాన్లో సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్లో శనివారం ఉరి తీసినట్లు అధికార వార్తా సంస్థ ఇర్నా తెలిపింది.
ఆ వ్యక్తి విదేశీ సర్వీసులతో ముఖ్యంగా మొసాద్కు రహస్య సమాచారాన్ని అందజేస్తున్నాడని ఆ వార్తా సంస్థ పేర్కొంది. అయితే, ఆ వ్యక్తి పేరు వెల్లడించలేదు. నిందితుడు తన వద్ద గల రహస్య సమాచారాన్ని మొసాద్ ఆఫీసర్కు అందచేశాడని, ఇస్లామిక్ రిపబ్లిక్ను వ్యతిరేకించే గ్రూపుల, సంస్థలకు ప్రచారం కోసం ఈ పని చేశాడని తెలిపింది. ఆ వ్యక్తి చేసుకున్న విజ్ఞప్తి తిరస్కరించబడిందని ఇర్నా తెలిపింది. సిస్తాన్ - బలూచిస్తాన్ ప్రావిన్స్లో జహెదాన్ జైల్లో ఈ ఉరిశిక్ష అమలైంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్తో సరిహద్దులు కలిగిన సిస్తాన్ - బలూచిస్తాన్ ప్రావిన్స్లో తరచూ భద్రతా బలగాలు, సున్నీ తీవ్రవాదులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూ వుంటాయి. ఇరాన్ ప్రజల్లో ఎక్కువమంది షియా ముస్లింలు కాగా, ఈ ప్రావిన్స్లో వుండేవారు సున్నీ ముస్లింలు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







