ముంబై - దోహా మధ్య నాన్-స్టాప్ ఫ్లైట్: విస్తారా
- December 17, 2023
గురుగ్రామ్: టాటా గ్రూప్ - సింగపూర్ ఎయిర్లైన్స్ మధ్య జాయింట్ వెంచర్ విస్తారా.. ముంబై -దోహా మధ్య వారానికి నాలుగు డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ప్రకటించింది. విస్తారా A321నియో ఎయిర్క్రాఫ్ట్లో నడిచే ప్రారంభ విమానం, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి డిసెంబర్ 15న 18:45 గంటలకు (IST) బయలుదేరి 20:30 గంటలకు (స్థానిక సమయం) దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఇండియా-మధ్యప్రాచ్యం మధ్య ప్రయాణానికి డిమాండ్లో స్థిరమైన పెరుగుదలతో విస్తారా ఈ ప్రాంతంలో తన ఉనికిని విస్తరించుకోవడంపై దృష్టి సారించినట్లు విస్తారా వెల్లడించింది. ఎయిర్లైన్ ఇప్పటికే ఈ ప్రాంతంలోని అబుదాబి, దమ్మామ్, దుబాయ్, జెడ్డా మరియు మస్కట్ గమ్యస్థానాలకు నేరుగా కనెక్టివిటీని అందిస్తుందని విస్తారా సీఈఓ వినోద్ కణ్ణన్ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









