ముంబై - దోహా మధ్య నాన్-స్టాప్ ఫ్లైట్: విస్తారా

- December 17, 2023 , by Maagulf
ముంబై - దోహా మధ్య నాన్-స్టాప్ ఫ్లైట్: విస్తారా

గురుగ్రామ్: టాటా గ్రూప్ - సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య జాయింట్ వెంచర్ విస్తారా.. ముంబై -దోహా మధ్య వారానికి నాలుగు డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ప్రకటించింది.  విస్తారా A321నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లో నడిచే ప్రారంభ విమానం, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి డిసెంబర్ 15న 18:45 గంటలకు (IST) బయలుదేరి 20:30 గంటలకు (స్థానిక సమయం) దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఇండియా-మధ్యప్రాచ్యం మధ్య ప్రయాణానికి డిమాండ్‌లో స్థిరమైన పెరుగుదలతో విస్తారా ఈ ప్రాంతంలో తన ఉనికిని విస్తరించుకోవడంపై దృష్టి సారించినట్లు విస్తారా వెల్లడించింది. ఎయిర్‌లైన్ ఇప్పటికే ఈ ప్రాంతంలోని అబుదాబి, దమ్మామ్, దుబాయ్, జెడ్డా మరియు మస్కట్ గమ్యస్థానాలకు నేరుగా కనెక్టివిటీని అందిస్తుందని విస్తారా సీఈఓ వినోద్ కణ్ణన్ తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com