ఒమన్, భారతదేశం మధ్య కుదిరిన పలు ఒప్పందాలు
- December 17, 2023
న్యూఢిల్లీ: ఒమన్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారత పర్యటన సందర్భంగా సుల్తానేట్ ఆఫ్ ఒమన్ - ఇండియా పలు ఒప్పందాలు, అవగాహనా ఒప్పందాలు (ఎంఓయులు) కుదిరాయి. సంస్కృతి, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇరుపక్షాల మధ్య ఆర్థిక సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి ఇవి వీలు కల్పిస్తాయి. ఈమేరకు ఇండియా సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన మంత్రిత్వ శాఖ, ఒమన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించి రిపబ్లిక్ ఆఫ్ ఒమన్ సుల్తానేట్ రాయబారి ఇస్సా బిన్ సలేహ్ అల్ షైబానీ, ఇండియా నుండి ఒమన్ సుల్తానేట్కు ఇండియా రాయబారి అమిత్ నారంగ్ సంతకాలు చేశారు. అధికారిక ఉద్యోగుల ప్రతినిధి బృందాలకు సంబంధించిన పని అనుమతికి సంబంధించిన ఒప్పందంపై ఒమన్ సుల్తానేట్ రాయబారి ఇస్సా బిన్ సలేహ్ అల్ షైబానీ ఒమానీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కాన్సులర్, పాస్పోర్ట్, వీసా మరియు విదేశీ భారతీయ వ్యవహారాల కార్యదర్శి ముక్తేష్ పరదేశి సంతకాలు చేశారు. ఒమన్ సుల్తానేట్ నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ మధ్య అవగాహన ఒప్పందంపై కూడా ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. మనీలాండరింగ్ సంబంధిత నేరాలు, ఉగ్రవాద ఫైనాన్సింగ్కు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పరస్పరం మార్చుకోవడం ఈ ఎంఓయూ కుదిరింది. వీటితోపాటు ఒమన్ - భారతదేశం మధ్య జాయింట్ విజన్ 2023పై కూడా ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష