ఒమన్, భారతదేశం మధ్య కుదిరిన పలు ఒప్పందాలు
- December 17, 2023
న్యూఢిల్లీ: ఒమన్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారత పర్యటన సందర్భంగా సుల్తానేట్ ఆఫ్ ఒమన్ - ఇండియా పలు ఒప్పందాలు, అవగాహనా ఒప్పందాలు (ఎంఓయులు) కుదిరాయి. సంస్కృతి, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇరుపక్షాల మధ్య ఆర్థిక సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి ఇవి వీలు కల్పిస్తాయి. ఈమేరకు ఇండియా సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన మంత్రిత్వ శాఖ, ఒమన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించి రిపబ్లిక్ ఆఫ్ ఒమన్ సుల్తానేట్ రాయబారి ఇస్సా బిన్ సలేహ్ అల్ షైబానీ, ఇండియా నుండి ఒమన్ సుల్తానేట్కు ఇండియా రాయబారి అమిత్ నారంగ్ సంతకాలు చేశారు. అధికారిక ఉద్యోగుల ప్రతినిధి బృందాలకు సంబంధించిన పని అనుమతికి సంబంధించిన ఒప్పందంపై ఒమన్ సుల్తానేట్ రాయబారి ఇస్సా బిన్ సలేహ్ అల్ షైబానీ ఒమానీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కాన్సులర్, పాస్పోర్ట్, వీసా మరియు విదేశీ భారతీయ వ్యవహారాల కార్యదర్శి ముక్తేష్ పరదేశి సంతకాలు చేశారు. ఒమన్ సుల్తానేట్ నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ మధ్య అవగాహన ఒప్పందంపై కూడా ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. మనీలాండరింగ్ సంబంధిత నేరాలు, ఉగ్రవాద ఫైనాన్సింగ్కు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పరస్పరం మార్చుకోవడం ఈ ఎంఓయూ కుదిరింది. వీటితోపాటు ఒమన్ - భారతదేశం మధ్య జాయింట్ విజన్ 2023పై కూడా ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







