ఒమన్, భారతదేశం మధ్య కుదిరిన పలు ఒప్పందాలు
- December 17, 2023
న్యూఢిల్లీ: ఒమన్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారత పర్యటన సందర్భంగా సుల్తానేట్ ఆఫ్ ఒమన్ - ఇండియా పలు ఒప్పందాలు, అవగాహనా ఒప్పందాలు (ఎంఓయులు) కుదిరాయి. సంస్కృతి, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇరుపక్షాల మధ్య ఆర్థిక సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి ఇవి వీలు కల్పిస్తాయి. ఈమేరకు ఇండియా సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన మంత్రిత్వ శాఖ, ఒమన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించి రిపబ్లిక్ ఆఫ్ ఒమన్ సుల్తానేట్ రాయబారి ఇస్సా బిన్ సలేహ్ అల్ షైబానీ, ఇండియా నుండి ఒమన్ సుల్తానేట్కు ఇండియా రాయబారి అమిత్ నారంగ్ సంతకాలు చేశారు. అధికారిక ఉద్యోగుల ప్రతినిధి బృందాలకు సంబంధించిన పని అనుమతికి సంబంధించిన ఒప్పందంపై ఒమన్ సుల్తానేట్ రాయబారి ఇస్సా బిన్ సలేహ్ అల్ షైబానీ ఒమానీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కాన్సులర్, పాస్పోర్ట్, వీసా మరియు విదేశీ భారతీయ వ్యవహారాల కార్యదర్శి ముక్తేష్ పరదేశి సంతకాలు చేశారు. ఒమన్ సుల్తానేట్ నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ మధ్య అవగాహన ఒప్పందంపై కూడా ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. మనీలాండరింగ్ సంబంధిత నేరాలు, ఉగ్రవాద ఫైనాన్సింగ్కు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పరస్పరం మార్చుకోవడం ఈ ఎంఓయూ కుదిరింది. వీటితోపాటు ఒమన్ - భారతదేశం మధ్య జాయింట్ విజన్ 2023పై కూడా ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









