యువకునికి అండగా నిలిచిన 'ETCA' మహిళలు
- May 28, 2016
ETCA సేవ కార్యక్రమాల్లో మేము సైతం అంటూ అనారోగ్యంతో పని చేయలేక ఇబ్బందులు ఎదురుకొంటున్న యువకునికి ఆపన్న హస్తం అందించిన ETCA మహిళా విబాగం.
భవిష్యత్ లో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ సామాజిక సేవ కార్యక్రమాలను విస్తృతం చేసి ETCA పటిష్టతకు , ఔన్నత్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తామని వెల్లడించిన మహిళా సభ్యులు.
వివరాలు :
పేరు తిరుసు శ్రీధర్ వయస్సు 20 సంవత్సరాలు , డిచ్ పల్లి , జిల్లా నిజామబాద్ కు చెందిన యువకుడు 40 రోజుల క్రింద వెల్దర్ వీసా పై అజ్మాన్ లోని ఒక ప్రైవేటు కంపనీలో రావడం జరిగింది , వచ్చిన తరువాత అనారోగ్యంతో బాధపడుతూ పనిచేయలేక ఇంటికి పంపమని యాజమాన్యాన్ని కోరడం జరిగింది . శ్రీధర్ అభ్యర్థనను తిరస్కరించడంతో మరియు కొంచెం కఠినంగా వ్యవహరించడంతో మానసిక వ్యధకు గురి అయిన యువకుడు సమచారాన్ని ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలయచేయడం జరిగింది . ఇబ్బంది పడుతున్న యువకుని పరిస్థితిని కొందరు డాక్టర్ ఎల్లాల శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకవెల్లగా వెంటనే స్పందించిన డాక్టర్ ETCA సభ్యులకు సమాచారాన్ని అందచేయడం జరిగింది. వెంటనే స్పందించిన ETCA సభ్యులు రవి ఊట్నురి, బాబు స్వామి,రాజ శేకర్ తోట బాదితుడి కంపెనీ కి వెళ్లి శ్రీధర్ కు నచ్చచెప్పి కావాల్సిన ఆర్ధిక సహాయాన్ని అందించి పరిస్థితిని అధ్యక్ష్యుడు పీచర కిరణ్ కుమార్ దృష్టికి తీసుకవెల్లడం జరిగింది . కంపెనీ యాజమాన్యంతో ఫోనులో మాట్లాడిన కిరణ్ వాస్తవ పరిస్థితులను తెలుసుకొని ఫ్రీ వీసా ఇచ్చిన యాజమాన్యనికి, అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని ఆఫీసు బాయ్ పని కల్పించిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపి బాదితుడి అనారోగ్య పరిస్థితిని వారికి తెలియచేసి, వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లను సమకురస్తామని చెప్పి, విషయాన్ని మహిళా విబాగ సభ్యులకు వాట్సప్ గ్రూప్ ద్వార తెలియ పరచడం జరిగింది .
వెంటనే స్పందించిన మహిళా సభ్యులు విరాళాలు ప్రోగు చేసి బాదితుడు ఇండియా వెళ్ళడానికి కావలసిన విమాన టికెట్ ను సమకూర్చి , 40 రోజుల్లో శ్రీధర్ కోసం వెచ్చించిన మెస్ ఖర్చుని , తీసుకున్న అడ్వాన్సు డబ్బులను, ఇతర ఖర్చులను కంపెనీ కి చెల్లించి స్వదేశానికి పంపడానికి సహయం అందించడం జరిగింది . మానవత హృదయంతో స్పందించిన మహిళ సభ్యులను ETCA కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు ప్రశంసించారు .
నోట్ : దయచేసి గల్ఫ్ దేశాలకు వచ్చే ముందు అన్ని విషయాలు ఆలోచించుకొని, జీవన స్థితి గతులను తెలుసుకొని , పని చేయగల సామర్థ్యం ఉన్నవారు మాత్రమే రావాలని, అవగాహన లేక వచ్చి పని చేయలేక వెల్లిపోతామంటే ఈ కంపెనీ యాజమాన్యం వలే అన్ని కంపెనీ యాజమాన్యాలు సహకరించవని, సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, అందరికి ఇబ్బందులు ఏర్పడే అవకశాలు ఉన్నాయని పేర్కొనడం జరిగింది .
ETCA మహిళా సభ్యులు గత రెండు సంవత్సరాలుగా సంఘ అభ్యున్నతి కోసం కలిసికట్టుగా కృషిస్తున్నారని , సేవ కార్యక్రమాల్లో సైతం భాగస్వామ్యులు అవడం అభినందనీయమని, సహకరించిన సభ్యులందరికీ కిరణ్ కుమార్ కృతజ్ఞతలు తెలియచేసారు .
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







